Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home TelanganaNalgonda గత ప్రభుత్వం పై ఉత్తమ్ విమర్శలు..

గత ప్రభుత్వం పై ఉత్తమ్ విమర్శలు..

by Rama
Uttham kumar reddy

గత బీఆర్ఎస్ ప్రభుత్వం సివిల్ సప్లై శాఖను నిర్వీర్యం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లోని చౌకధరల దుకాణాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. మిల్లర్ల దగ్గర ఉన్న లెవీ ధాన్యం స్వాధీనం చేసుకుంటామని ఉత్తమ్ తెలిపారు. ప్రతి ఏటా సివిల్ సప్లై శాఖ 3 వేల కోట్ల వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. తెలంగాణ బియ్యాన్ని తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సిస్టం ద్వారా అమ్ముతామన్నారు. అవసరమైతే ఓపెన్ మార్కెట్‌లో బహిరంగ వేలం వేస్తామన్నారు. మిల్లర్ల వద్ద ఎలాంటి గ్యారెంటీ లేకుండా 22 వేల కోట్ల ధాన్యం గత ప్రభుత్వం పెట్టిందని మంత్రి ఆరోపించారు. అది కాకుండా కార్పొరేషన్ ఇప్పుడు 11వేల కోట్లు నష్టాల్లో ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

014097
Total views : 78970

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.