Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra PradeshKurnool శ్రీశైలం చేరుకున్న అయోధ్య అక్షింతలు..

శ్రీశైలం చేరుకున్న అయోధ్య అక్షింతలు..

by Rama
axes

శ్రీశైలం క్షేత్రానికి మంగళవారం అయోధ్య రామమందిరం నుంచి శ్రీరాముని అక్షింతలు చేరుకున్నాయి. ఈ పరమ పవిత్రమైన శ్రీరాముని అక్షింతలకు స్థానికలు మల్లికార్జునస్వామి, భ్రమరాంబికాదేవి ప్రధానాలయం ముందుభాగంలో గంగాధర మండపము వద్ద అక్షింతలకు ప్రత్యేక పూజాదికాలు జరిపించి, క్షేత్రపరిధిలో కోలాహలంగా ఊరేగింపు నిర్వహించారు. రేపటి నుంచి ఈ నెల 15 వరకు ఇంటింటికీ శ్రీరాముని అక్షింతలను పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా శ్రీరాముని అక్షింతలు దేశంలోని నలుమూలలకు పంపిస్తున్న తరుణంలో శ్రీశైలం క్షేత్రానికి కూడా చేరుకోవడంతో తాముకూడా శ్రీరాముని అక్షింతలు పొందుతున్నామని స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేపు ఉదయం పాతాళగంగ ఆంజనేయస్వామి ఆలయం నుండి అక్షింతలు పంపించేస్తామని తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

014090
Total views : 78946

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.