Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Andhra PradeshWest Godavari పానిపూరి తిని ఇద్దరు చిన్నారులు మృతి..

పానిపూరి తిని ఇద్దరు చిన్నారులు మృతి..

by Rama
Pani Puri

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం లో పానిపూరి తిని ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది. బుధవారం రాత్రి పాని పూరి తిన్న ఇద్దరు చిన్నారులు తెల్లవారు జామున వాంతులు విరోచనాలతో ఆసుపత్రిలో మృతి చెందారు. చిన్నారులు తిన్న ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల మృతి చెంది వుండవచ్చని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతులు నంద్యాల జిల్లా రేచర్ల గ్రామానికి చెందిన రామ కృష్ణ(10), విజయ్ (6) లు అని రూ.100 ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకోవడానికి ఉపాధి కోసం కుటుంబంతో జంగారెడ్డిగూడెం వచ్చారని బంధువులు తెలిపారు. చిన్నారుల మృతికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. జంగారెడ్డిగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: