Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra Pradesh ఆ రెండు ప్రభుత్వాలకు ఓటు అనే ఆయుధంతో…

ఆ రెండు ప్రభుత్వాలకు ఓటు అనే ఆయుధంతో…

by Prakash
Kisan Morcha programme

మార్చి 14వ తేదీ ఢిల్లీలో రామ్ లీలా మైదానంలో జరిగే కిసాన్ మోర్చా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు రామానాయుడు పిలుపునిచ్చారు. అదే విధంగా రైతు సంఘాల పోరాటానికి, ప్రజాసంఘాలు మద్దతు తెలుపుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను తిరుచానూరు బైపాస్ లోని యోగి మల్లవరం బ్రిడ్జి దగ్గర ప్రజాసంఘాల నాయకులు ఆధ్వర్యంలో కర పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలోని పెద్ద ఎత్తున రైతు పోరాటం నిర్వహించడం జరిగిందని, ఆ పోరాటానికి దేశవ్యాప్తంగా కార్మిక మధ్య పేద తరగతి మద్దతు తెలపడంతో కేంద్ర ప్రభుత్వం. తలవంచిందని చెప్పారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అలాగే రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేనకు, బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి నగర అధ్యక్షులు కేవైసీ రాజా ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: