Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home TelanganaKarimnagar సింగరేణి భూముల్లో మట్టి అక్రమ రవాణా చోద్యం చూస్తున్న అధికారులు..

సింగరేణి భూముల్లో మట్టి అక్రమ రవాణా చోద్యం చూస్తున్న అధికారులు..

by Rama
Singareni

పెద్దపల్లి జిల్లా సింగరేణి (singareni) సంస్థ రామగుండం (Ramagundam) ఏరియా వన్ పరిదిలోని ముస్త్యాల, సుందిల్ల శివారు భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. జెసిబిలు, ట్రాక్టర్లు ద్వారా నిత్యం యదేచ్చగా మట్టిని రవాణా చేస్తున్న స్థానిక సింగరేణి అధికారులు, రెవిన్యూ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా సింగరేణి స్థలాల్లొ నుంచి మట్టిని తరలిస్తున్న రెవిన్యూ అధికారులు కానీ, సింగరేణి అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

దీంతో ఇదే అదునుగా భావించిన మట్టి మాఫియా యధేచ్ఛగా మట్టిని రవాణా చేస్తూ లక్షల రూపాయాల విలువ గల మట్టిని అడ్డగోలుగా తరలిస్తున్నారు. స్థానిక అధికారుల తీరును ప్రజలు తప్పుబడుతున్నారు. ఇప్పటికైనా స్థానిక అధికారులు తీరు మార్చుకొని, మట్టిని రవాణా చేస్తున్న అక్రమార్కులపై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.
    వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
  • రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
    రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
  • బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
    యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

039486
Total views : 197111

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: