ప్రధాని మోదీ (Narendra Modi) యూపీలోని వారణాసి లోక్సభ ఎంపీ స్థానానికి ఈ నెల 14న నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ వేయడానికి ఒకరోజు ముందు 13వ తేదీన భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. జిల్లా అధికారుల సమాచారం ప్రకారం ఈ రోడ్ షో ప్రారంభించడానికి ముందు ప్రధాని లంకలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రధాన గేటు వద్ద ఉన్న మదన్ మోహన్ మాలవ్య విగ్రహానికి నివాళ్లు అర్పిస్తారు. ఆ తర్వాత రోడ్ షోలో పాల్గొంటారు. ఈ రోడ్ షో కాశీ విశ్వనాథ్ కారిడార్ వరకు ఐదు కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. లక్షలాది మంది ఈ రోడ్ షోలో పాల్గొనే అవకాశం ఉంది. అస్సి, సోనార్పూర, జంగం బరి, గోడౌలియా, బన్స్పథక్ మీదుగా విశ్వనాథ్ కారిడార్కు చేరుకుంటుందని బీజేపీ నేత దీలిప్ పటేల్ వెల్లడించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ రోడ్ షో చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించే బాధ్యతను పార్టీ కార్యకర్తలకు అప్పగించినట్లు చెప్పుకొచ్చారు. వారణాసి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మీటింగులు ముగిసిన తర్వాత 21 డివిజన్లలోని పార్టీ కార్యకర్తలను ప్రధాని రోడ్ షోకు భారీ సంఖ్యలో జనాలను తీసుకువచ్చేలా దిశానిర్దేశం చేయనున్నారు. ఇక వారణాసి నుంచి మోదీ ఇప్పటికే రెండుసార్లు ఎంపీగా గెలిచారు. వరుసగా 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన విజయఢంకా మోగించారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విజయవాడ కలెక్టరేట్లో చంద్రబాబుతో పవన్ భేటీవిజయవాడ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జనసేనాని ఇటీవల తాను సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళం ప్రకటించిన కోటి రూపాయల తాలూకు చెక్కును ముఖ్యమంత్రికి…
- వినాయక చవితి పండుగ వేళ తిరుమలలో విషాదం..వినాయక చవితి పండుగ వేళ తిరుమలలో విషాదం నెలకొంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్న భక్తురాలు ఝాన్సీ గుండెపోటుతో కుప్పకూలింది. అక్కడే ఉన్న తోటి భక్తులు, ఆమె తండ్రి అయోమయానికి గురయ్యారు. ఇంతలో వైద్య…
- ముంపు కష్టాలు వీడేలా .. అభయమివ్వు గణేశావినాయక చవితి పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.…