తిరుపతి రూరల్ మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party)కి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్య నేతలంతా వరుసగా తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)లో చేరిపోయారు. తిరుపతి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పలువురు వైసీపీ కి చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు. వీరంతా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో చేరుతున్నట్లు ప ప్రకటించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఆవిలాల పంచాయతీకి చెందిన మాజీ జెడ్పిటిసి సుభాషిని,కూడా టీడీపీ తీర్ధం పుచ్చుకున్న వారిలో ఉన్నారు. చెవిరెడ్డి కుటుంబ పాలన తమకు గుర్తింపు ఇవ్వడంలేదంటూ స్థానిక ప్రజా ప్రతినిధులు వాపోయారు. ఆత్మాభిమానం, గౌరవం కోసం నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్న పులివర్తి నాని వెంట నడిచేందుకు సిద్దమయ్యామని తెలిపారు.
- పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని హోంమంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అనిత పర్యటించారు. కోటవురట్ల మండలం రామచంద్రపురం గ్రామానికి చేరుకున్న మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రామచంద్రపురం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి…
- మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో గ్రామకంఠం భూమిని ఆక్రమించి నిర్మించిన ఇళ్లను కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేశారు. భారీ బందోబస్తుతో పోలీసు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఈ…
- అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో రహదారి సమస్యలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అరకు, డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల్లోని పలు గ్రామాలు ఇప్పటికీ కనీస రహదారి సౌకర్యం లేకుండా ఉన్నాయి. మాడగడ పంచాయతీ పరిధిలోని మెచ్చగూడ గ్రామస్తులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Total views : 62302