గురువారం రోజు ఉదయం రాయచోటి బస్టాండ్ ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రభుత్వం కొనుగోలు చేసిన నూతన బస్సులను ప్రారంభించారు అనంతరం విలేకరుల ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఆర్టీసీ ఆస్తులు ఆక్రమించుకొని ఆర్టీసీని నిర్వీర్యం చేశారన్నారు. కాబోయే కాలంలో ఆర్టీసీని ప్రక్షాళన గావించి ప్రయాణికులకు నాణ్యమైన సేవల అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే కాలంలో మరిన్ని నూతన బస్సులను కొనుగోలు చేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు.అన్నమయ్య జిల్లా మార్పుపై వస్తున్న వార్తలపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లిఅన్నమయ్య జిల్లాలను మారుస్తున్నారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఎట్టి పరిస్థితుల్లో జిల్లా మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ఊరు పేర్లు, సంస్థల పేర్లు మార్చే ప్రభుత్వం మాది కాదని మాది ప్రజా ప్రభుత్వమని ప్రజలకు అనుగుణంగా నడుచుకునే ప్రభుత్వము అని పేర్కొన్నారు… రాబోయే కాలంలో రాయచోటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు…
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
- నీట్ పేపర్ లీక్పై సుప్రీంకోర్టులో విచారణ.నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
- సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో విచిత్ర ఘటన.సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నేరస్తులు, ఖైదీలకు వేయాల్సిన సంకెళ్లను ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకే వేసిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఠాణా ప్రాంగణంలోకి ఇతర వాహనాలు, అనధికార…
- సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష విరమణ.దేశ విద్యావ్యవస్థలో పారదర్శకత, సమగ్ర సంస్కరణల కోసం గత 26 రోజులుగా లడఖ్ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చల అనంతరం ఆయన తన సుదీర్ఘ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.