జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మేయర్,డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్దమవుతుండగా… ఎంఐఎం సపోర్టు ఎవరికన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. మధ్యలో బీజేపీ స్టాండ్ ఏంటి..? అన్న దానిపైనా తెగ చర్చ నడుస్తోంది. మేయర్, డిప్యూటీ మేయర్ బీఆర్ఎస్కు బై చెప్పి… హస్తం పార్టీకి నేస్తం కావడంతో ఇవాళ్టి మీటింగ్పై ఆసక్తి నెలకొంది. వారిద్దరిపై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. కారు పార్టీ గుర్తుతో గెలిచి కాంగ్రెస్లోకి ఎలా వెళ్తారంటూ,మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామాకు బీఆర్ఎస్ డిమాండ్ అయ్యింది. అయితే మొన్నటివరకు బీఆర్ఎస్తో ఫ్రెండ్షిప్ చేసిన ఎంఐఎం పార్టీ , బీఆర్ఎస్ అవిశ్వాసానికి మద్ధతు ఇస్తుందా…? లేక కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుందా…? అన్నది సస్పెన్స్గా మారింది. అయితే ఎంఐఎం ఎవరికి మద్దతిస్తే , వారికే బల్దియా పీఠం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
బీఆర్ఎస్లో ప్రస్తుతం 47 మంది కొర్పొరేటర్లు ఉండగా.. ఎంఐఎంకి 41. బీజేపీకి 39, ఇటు కాంగ్రెస్కు 19 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 2020లో కాంగ్రెస్కు ఇద్దరు కార్పొరేటర్లు మాత్రమే ఉండగా , అధికారంలోకి రావడంతో వారి సంఖ్య 19కి చేరింది. అయితే కౌన్సిల్లో బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ , ఏదో ఒకపార్టీ మద్దతు ఉంటేనే అవిశ్వాసం నెగ్గే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పుడున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లలో ఎంతమంది మీటింగ్ వస్తారన్నది క్లారిటీ లేదు. మరోవైపు బీజేపీ స్టాండ్పైనా తెగ చర్చ నడుస్తోంది. కౌన్సిల్ మీటింగ్లో వారు ఏం మాట్లాడతారు…? వారి వ్యూహమేంటన్నది…? ఉత్కంఠగా మారింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జోహార్ కామ్రేడ్ … సీతారాం ఏచూరిఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే…
- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడ్తంపోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు,…
- వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమాదేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ…
- బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలనంబెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన…
- అత్యుత్తమ దేశాల జాబితాలో టాప్ లో స్విట్జర్లాండ్ప్రపంచ దేశాలలో అత్యుత్తమ దేశంగా ‘స్విట్జర్లాండ్’ మరోసారి నిలిచింది. బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ లో వరుసగా మూడోసారి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అందమైన పర్యాటక ప్రాంతాలతో పాటు జీవన ప్రమాణం, నాణ్యత, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి