జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మేయర్,డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్దమవుతుండగా… ఎంఐఎం సపోర్టు ఎవరికన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. మధ్యలో బీజేపీ స్టాండ్ ఏంటి..? అన్న దానిపైనా తెగ చర్చ నడుస్తోంది. మేయర్, డిప్యూటీ మేయర్ బీఆర్ఎస్కు బై చెప్పి… హస్తం పార్టీకి నేస్తం కావడంతో ఇవాళ్టి మీటింగ్పై ఆసక్తి నెలకొంది. వారిద్దరిపై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. కారు పార్టీ గుర్తుతో గెలిచి కాంగ్రెస్లోకి ఎలా వెళ్తారంటూ,మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామాకు బీఆర్ఎస్ డిమాండ్ అయ్యింది. అయితే మొన్నటివరకు బీఆర్ఎస్తో ఫ్రెండ్షిప్ చేసిన ఎంఐఎం పార్టీ , బీఆర్ఎస్ అవిశ్వాసానికి మద్ధతు ఇస్తుందా…? లేక కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుందా…? అన్నది సస్పెన్స్గా మారింది. అయితే ఎంఐఎం ఎవరికి మద్దతిస్తే , వారికే బల్దియా పీఠం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
బీఆర్ఎస్లో ప్రస్తుతం 47 మంది కొర్పొరేటర్లు ఉండగా.. ఎంఐఎంకి 41. బీజేపీకి 39, ఇటు కాంగ్రెస్కు 19 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 2020లో కాంగ్రెస్కు ఇద్దరు కార్పొరేటర్లు మాత్రమే ఉండగా , అధికారంలోకి రావడంతో వారి సంఖ్య 19కి చేరింది. అయితే కౌన్సిల్లో బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ , ఏదో ఒకపార్టీ మద్దతు ఉంటేనే అవిశ్వాసం నెగ్గే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పుడున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లలో ఎంతమంది మీటింగ్ వస్తారన్నది క్లారిటీ లేదు. మరోవైపు బీజేపీ స్టాండ్పైనా తెగ చర్చ నడుస్తోంది. కౌన్సిల్ మీటింగ్లో వారు ఏం మాట్లాడతారు…? వారి వ్యూహమేంటన్నది…? ఉత్కంఠగా మారింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ .గిరిజనులకు వ్యవసాయం తర్వాత రెండో జీవనాధారమైన తునికాకు సేకరణ ప్రక్రియ మొదలైంది. అడవుల్లో లభించే ఈ ఆకులను సేకరించి గిరిజనులు ఆదాయం పొందుతారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని అడవుల్లో తునికాకు విస్తృతంగా లభిస్తుంది. బీడీలు తయారు చేయడానికి…
- దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..టాలీవుడ్ లో పావలా శ్యామల స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె చివరి రోజుల్లో నరకం చూస్తోంది. ఆదరించేవారు లేక, చేతిలో డబ్బులేక ఆర్కే ఫౌండేషన్ లో తలదాచుకుంటుంది. ఇక గుండె సమస్యతో కొట్టుమిట్టాడుతోన్న పావలా శ్యామల, ఆమె కూతురు…
- జూబ్లీహిల్స్ హత్య, దోపిడీ ఘటనలో పురోగతి..హైదరాబాద్లో సంచలనం సృష్టించిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ వినయ్రంజన్రే భార్య హత్య, దోపిడీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ ఘోరానికి పాల్పడినట్టు గుర్తించారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న కల్పన అనే నేపాలీ…
- ఆఫ్రికాలో ఎబోలా కలకలం..ఆఫ్రికా ఖండంలో ఎబోలా పంజా విసురుతోంది. కాంగో, ఉగాండా దేశాల్లో ఈ ప్రాణాంతక వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కాంగోలో 88మంది మృతి చెందగా…మరో 300మంది ఈ వైరస్ బారిన పడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ…
- ఇరాన్ ముందు అమెరికా ఐదు కఠిన షరతులు..ఇరాన్తో జరుగుతున్న శాంతి చర్చల్లో అమెరికా ఐదు కఠిన షరతులు విధించింది. ఇప్పటి వరకు ఇరాన్కు జరిగిన నష్టాలకు ఎలాంటి పరిహారం చెల్లించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. ఇరాన్ తన వద్ద ఉన్న 400 కిలోల శుద్ధిచేసిన యురేనియంను తమకు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 79960