Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Latest News ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ పనులకు త్వరలోనే రీ టెండర్

ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ పనులకు త్వరలోనే రీ టెండర్

by Rama
ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ పనులకు త్వరలోనే రీ టెండర్

ఉప్పల్‌ – నారపల్లి ఫ్లై ఓవర్‌ పనులకు త్వరలో రీ టెండర్‌ పిలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. వర్షాకాలంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రహదారి మరమ్మతులు చేపడతామన్నారు. ప్రతిపక్ష పాత్ర కీలకమైందని.. కేసీఆర్‌ అసెంబ్లీకి రానప్పుడు ఆ పార్టీపై ఆశలు వదులుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో.. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు ముగ్గురు కలిసి రేవంత్‌రెడ్డిని ఓడించలేకపోయారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఫారిన్‌ వెళితే.. చూసుకోవడానికి తానున్నానని.. బీఆర్ఎస్ కు తానొక్కడినే చాలని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్ఎస్ ఛాంబర్‌కు వెళ్లినంత మాత్రాన పార్టీలో చేరినట్లా అని ప్రశ్నించారు. కేటీఆర్‌ కూడా నా ఛైర్‌ దగ్గరకు వచ్చి మాట్లాడారు. ఆయన కూడా కాంగ్రెస్‌లో చేరినట్లేనా అని ఎదురు ప్రశ్నించారు. త్వరలో ప్రధానిని కలిసి రాష్ట్ర రహదారుల కోసం నిధులు అడుగుతామని పేర్కొన్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..
    ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు భారీ ఊరట లభించింది. హర్యానాలోని గురుగ్రామ్ భూ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఆయనకు ఉపశమనం కలిగింది. ఇవాళ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన ఆయనకు ప్రత్యేక…
  • నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..
    నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బోరు గుంతలో పడిపోయిన నాలుగేళ్ల చిన్నారిని కాపాడేందుకు వెళ్లిన తాత ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్ద ఆడుకుంటున్న…
  • మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..
    మహారాష్ట్రలోని పుణెలో ఓ యువకుడు చేసిన నకిలీ బాంబు కలకలం వెయ్యిమంది పోలీసులను పరుగులు పెట్టించింది. సోలాపూర్‌కు చెందిన శివాజీ రాథోడ్‌ అనే యువకుడు తన వైద్యానికి 7 లక్షల రూపాయలు సమీకరించాలనే ఉద్దేశంతో ఈ డ్రామాకు తెరలేపాడు. హడప్‌సర్‌లోని కామధేను…
  • బంగారం దిగుమతులను తగ్గించేందుకు కొత్త వ్యూహం..
    దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పే ఒక అతిపెద్ద సంచలనానికి మోదీ సర్కార్ సిద్ధమవుతోందా? మీ ఇంట్లో.. అల్మారాల్లో.. లాకర్లలో పేరుకుపోతున్న బంగారం, ఇప్పుడు దేశానికి ఆర్థిక ఆయుధంగా మారబోతోందా..? అసలు ఏంటి ఈ గోల్డ్ మానిటైజేషన్ మాస్టర్ ప్లాన్? సామాన్యుడికి…
  • చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..
    అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వైట్‌హౌస్‌కు చేరుకున్నారు. యావత్‌ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ట్రంప్‌ రెండ్రోజుల చైనా పర్యటన ముగిసింది. ఒప్పంద ప్రకటనలేవీ లేకుండానే ఈ పర్యటన ముగిసింది. ఐతే కీలకాంశాల్లో ఏకాభిప్రాయాలు కుదిరాయని, ద్వైపాక్షిక సంబంధాల విషయంలో కీలక పురోగతి…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

013930
Total views : 78479

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.