173
బెంగాల్కు నష్టం చేసే ప్రయత్నాలు చేస్తే బీజేపీ జాతీయస్థాయిలో దెబ్బతింటుందని అన్నారు సీఎం మమతా బెనర్జీ. రాణిగంజ్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి గెలవడమే తమ పార్టీ లక్ష్యమని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో విజయం సాధించిన తర్వాత ఢిల్లీని కూడా స్వాధీనం చేసుకోవడానికి వివిధ రాజకీయ పార్టీలను ఏకం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే వారు బుల్డోజర్లను ఉపయోగించి అందరినీ బయటకు గెంటివేస్తారని హెచ్చరించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో ఓటర్ల జాబితా నుంచి కొన్ని పేర్లను తొలగించడం ద్వారా ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.



Total views : 194269