Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra Pradesh ఏపీలో వితంతువులకు శుభవార్త..

ఏపీలో వితంతువులకు శుభవార్త..

by CVR NEWS
ఏపీలో వితంతువులకు శుభవార్త

రాష్ట్రంలోని వితంతువులకు ఏపీలోని కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూన్ 12వ తేదీ నుంచి కొత్తగా పింఛన్లు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు.
అర్హులైన లబ్ధిదారులు త్వరలోనే ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల అనేక రెవెన్యూ సమస్యలు పేరుకుపోయాయని, వాటిని పరిష్కరించేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

014520
Total views : 80418

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.