37
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గొలకోటివారిపాలెం గ్రామంలో సాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. పంట కాలువలకు నీరు వచ్చి నెల రోజులు దాటినా తమ పొలాలకు నీరు అందడం లేదని రైతులు కాలువలోనే కూర్చొని నిరసన తెలిపారు. చిన్న, కౌలు రైతులైన తమకు సాగునీరు లేక సుమారు 70 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని, ఆకుమడి వేయడానికి కూడా నీరు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేదని ఆరోపిస్తూ, వెంటనే నీరు విడుదల చేయాలని, లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.






Total views : 192651