63
తెలంగాణను పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, పారదర్శకమైన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తూ పూర్తి సహకారం అందిస్తున్నామని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందన్నారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణాన్ని కల్పించడంలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి స్పష్టం చేశారు. పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.






Total views : 192648