దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించారు. ప్రముఖ ఫుట్వేర్ తయారీ సంస్థ షూఆల్స్ ఛైర్మన్, సీఈవో లీ చియాంగ్-గెన్తో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. గతంలో కుదిరిన ఎంవోయూ ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటు కానున్న ఫుట్వేర్ తయారీ యూనిట్ పనులను వేగవంతం చేయాలని ఆయన కోరారు.300 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ యూనిట్ ద్వారా దాదాపు మూడు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని లోకేష్ తెలిపారు. దీనితో పాటు ఆంధ్రప్రదేశ్లో ఆర్ అండ్ డీ, ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని, షూఆల్స్ ఉత్పత్తులకు ఏపీని రిటైల్, డిస్ట్రిబ్యూషన్ హబ్గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. మంత్రి లోకేష్ సూచనలపై షూఆల్స్ ఛైర్మన్ లీ చియాంగ్-గెన్ సానుకూలంగా స్పందించారు. తమ సంస్థ మాగ్నెటిక్ థెరపీ, షాక్ అబ్సార్ప్షన్ టెక్నాలజీతో మెడికల్ ఫుట్వేర్ తయారీలో ప్రత్యేక గుర్తింపు పొందిందని తెలిపారు. ప్రస్తుతం సియోల్ నేషనల్ యూనివర్సిటీతో కలిసి ఏఐ ఆధారిత స్మార్ట్ మెడికల్ ఫుట్వేర్ను అభివృద్ధి చేస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్.
38






Total views : 192647