Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Andhra Pradesh రాయలసీమ అభివృద్ధిపై టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర వ్యాఖ్యలు.

రాయలసీమ అభివృద్ధిపై టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర వ్యాఖ్యలు.

by CVR NEWS
రాయలసీమ అభివృద్ధిపై టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర వ్యాఖ్యలు

రాయలసీమ అభివృద్ధిపై వైసీపీ చేస్తున్న విమర్శలను టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తీవ్రంగా ఖండించారు.కూటమి ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని, వైసీపీ మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.దేశానికి వచ్చే పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్‌కు గణనీయమైన వాటా లభిస్తోందని, కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో కూటమి ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అన్నారు.మంత్రి నారా లోకేష్ మిషన్ రాయలసీమ లక్ష్యంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు.రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో వైసీపీ కొత్త రాజకీయ డ్రామాకు తెరలేపిందని ఆరోపించిన ఆయన.. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆ ప్రాజెక్టును అభివృద్ధి కోసం కాకుండా అవినీతికి వేదికగా మార్చిందని విమర్శించారు.జగన్ ప్రభుత్వ హయాంలో రాయలసీమ అభివృద్ధికి ఎంత ఖర్చు చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిలో చేసే ఖర్చుకు సమానంగా కూడా వైసీపీ ఐదేళ్లలో ఖర్చు చేయలేదని ఆరోపించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040829
Total views : 212128

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: