కృష్ణా జిల్లా గుడివాడలో డాక్యుమెంట్ రైటర్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఎంఎస్ నెం.396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పెన్డౌన్ కార్యక్రమంలో భాగంగా 10 రోజుల పాటు విధులు బహిష్కరించారు. ప్రభుత్వం వెంటనే జీవో 396ను వెనక్కి తీసుకోవాలని డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరారెడ్డి డిమాండ్ చేశారు. ఈ జీవో వల్ల వేలాది మంది డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్ల జీవనోపాధి దెబ్బతింటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే భవిష్యత్తులో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పెన్డౌన్ కార్యక్రమానికి ప్రజలు, సంబంధిత వర్గాలు మద్దతు ఇవ్వాలని కోరారు.కాగా పెన్డౌన్ కారణంగా రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కృష్ణా జిల్లా గుడివాడలో డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన.
46
previous post



Total views : 221432