ఏలూరు జిల్లా(Eluru District)లో దారుణం..
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం(Jangareddygudem) మండలం లక్కవరం గ్రామంలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ప్రగడ నాగేశ్వర రావు పై సొంత అల్లుడు యాసిడ్(Acid) తో దాడి చేశారు. దీంతో నాగేశ్వర్ రావు(Nageshwar Rao) తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడు నాగేశ్వరావు పెద్ద కుమార్తెను లారీ డ్రైవర్ రమేష్(Ramesh) కి ఇచ్చే వివాహం చేశారు. వివాహం అయిన దగ్గర నుండి నిందితుడు తన కూతుర్ని చిత్రహింసలకు గురి చేస్తున్నాడని అల్లుడిని నాగేశ్వర్ రావు మందలించేవాడు.
ఇది చదవండి: పవన్ కళ్యాణ్ అప్డేట్స్…
ఇదంతా మనసులో పెట్టుకున్న అల్లుడు రమేష్ మామ పై బ్యాటరీ లోని డిజిటల్ వాటర్ , యాసిడ్ తో దాడి చేశారు. దీంతో ఒక్కసారిగా నాగేశ్వర్ రావు కేకలు వేశారు. స్థానికులు వెంటనే జంగారెడ్డి గూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఏలూరులో చేర్పించగా చికిత్స పొందుతూ నాగేశ్వర్ రావు చనిపోయాడు. జరిగిన ఘటనపై లక్కవరం పోలీసు(Police)లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 62199