Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Andhra Pradesh జగన్ కు మిగిలేది చంచల్ గూడ జైలే..

జగన్ కు మిగిలేది చంచల్ గూడ జైలే..

by Rama
Jagan- Banadaru Satyanarayana

జగన్ సిఎం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టిడిపి నాయకులను, కార్యకర్తలను వేధించడమే పనిగా పెట్టుకున్నారని టిడిపి సీనియర్ నేత బండారు సత్యనారాయణ విమర్శించారు. రోజా వేసిన ప్రైవేట్ కేసు విచారణలో భాగంగా బండారు నగరి జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రూల్ ఆఫ్ లా ప్రకారం కాకుండా తనదైనశైలిలో సైకో పరిపాలన చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుపై ఏ ఆధారాలు లేకుండా కేసులు పెట్టి, జైల్లో నిర్భందించి ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. నెల రోజుల్లో చంద్రబాబు – పవన్ పాలన వస్తుందని, జగన్ నాశనం చేసిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తారని తెలిపారు. ఎన్నికల తర్వాత జగన్ రాష్ట్రంలో ఉండడని, జగన్ కు మిగిలేది చంచల్ గూడ జైలే అన్నారు. నోరు మంచిది అయితే ఊరు మంచిదవుతుందని, రోజా తన నోటిని అదుపులో పెట్టుకోవాలని బండారు హితవు పలికారు.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: