Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Andhra Pradesh బిజెపి పార్టీ జెండా ఆవిష్కరణ…

బిజెపి పార్టీ జెండా ఆవిష్కరణ…

by Prakash
Inauguration of BJP Party Flag

ఓబులవారిపల్లి మండలంలోని తల్లెం వారి పల్లి గ్రామంలో బిజెపి యువ నాయకులు నియోజకవర్గ సమన్వయకర్త, చిన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముందుగా బిజెపి నాయకులు గ్రామంలోకి రాకతో పూలు వెద జల్లుతూ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ నాయకుడు సత్య కుమార్, జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనతాల సురేష్, అసెంబ్లీ కన్వీనర్ గడ్డం చంగల్ రాజు హాజరయ్యి గ్రామంలో జెండా ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో భారతదేశానికి గుర్తింపు తీసుకు వచ్చిన పార్టీ బిజెపి అని తెలిపారు. నియోజకవర్గ సమన్వయకర్త గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవమైన అయోధ్య రామ మందిరం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుగుతున్నది. కరోనా కష్టకాలంలో వివిధ దేశాలకు వ్యాక్సిన్ పంపి భారతదేశాన్ని ప్రాణదాతగా నిలిచేలా చేసింది బిజెపి అని కొనియాడారు. బిజెపి పార్టీ అంటే తెలియని గ్రామాలలో సైతం జాతీయ నాయకుల చేత గ్రామాల్లో జెండా ఆవిష్కరణ జరుగుతున్నది అంటే బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తల ఫలితమని తెలిపారు. గ్రామ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో బిజెపి పార్టీ వైపున్న తమను వైసీపీ నాయకులు నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అభిమానులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: