వై.ఎస్.అర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సంధర్బంగా కాకినాడ జిల్లా వైసిపి అధ్యక్షులు రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు మధ్య ఘనంగా నిర్వహించారు. రూరల్ అభివృద్ది కమిటీ చైర్మన్ కుర సాల సత్యనారాయణ, కరప జెడ్పీటీసీ సభ్యులు యళ్ళ సుబ్బారావు, తిమ్మాపురం సర్పంచ్ బేజావాడ సత్యనారాయణ పార్టీ జెండాను ఆవిష్కరించి, వై.ఎస్.అర్ విగ్రహానికి పుల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మీడియా తో మాట్లాడుతూ వైసిపి 14 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రూరల్ నియోజకవర్గం లో పెద వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద సుమారు 10 లక్షల చెక్ లను పంపిణీ చేశామని, పెదల అభ్యున్నతికి వైసిపి ఎల్లపుడూ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆలోచనలు, అసాయలు అంత పెద వారి కోసమే అని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
East Godavari
సీఎం జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ తమ సంఘీభావం తెలుపుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ సమాఖ్య చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి మరియు వైస్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ సంఘాల నాయకులు మరియు ఉద్యోగులు పి.గన్నవరం త్రీ రోడ్ సెంటర్ నుండి భారీ ర్యాలీతో సంఘీభావం తెలుపుతూ జై జగన్ అంటున్న ప్రభుత్వ ఉద్యోగులు ఒక పక్క సీఎం జగన్ మాకు రావాల్సిన డిఏ లు ఇవ్వకుండా ఎగ్గొ్డుతునాదని పిఆర్సి పైన అసంతృప్తి వెళ్ళగక్కుతూ పైపైకి జగన్ జై అంటు లోలోన మదన పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ సమాఖ్య చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాల వ్యవధిలో 1,30,000 వార్డు సచివాలయ ఉద్యోగాలను మెరిట్ ప్రకారం ఇవ్వడం జరిగిందని అందుకు ముందుగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. 50,000 ఆర్టిసి ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగులు తో సమానం చేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. అది కూడా మూడు నెలల వ్యవధిలోనే జరిగిందని వైద్య శాఖ లో 53వేల మంది ఉద్యోగులను నియమించిందని ఆర్థిక శాఖ అధికారులు ఒక ప్రక్క వద్దు అనే దందాపనలో ఉన్న అందరినీ కాదని జగన్మోహన్ రెడ్డి ఇంతమంది ఉద్యోగాలకు కారకులయ్యారని ప్రభుత్వ ఆసుపత్రిలో 14 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారని 105 రకాల మందులు ఇస్తున్నారని వృద్ధాప్యం వల్ల తిరగలేని వృద్ధులకు నెలనెలా ఇంటికి వచ్చి బీపీ షుగర్ వంటి పరీక్షలు చేసి కావలసిన మందులు ఇస్తున్నారని ఆయన తెలిపారు.
కరోనా సమయంలో కష్టకాలంలో అందరికీ కూడా పే స్కేల్స్ సరిపెట్టారు… ఏ రాష్ట్రంలోనూ కూడా ఆర్టీసీ ఉద్యోగులకు కరోనా సమయంలో జీతాలు ఇవ్వలేదని కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలోని మాత్రమే జీతాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి లేదు అని సోషల్ మీడియా ద్వారా మాట్లాడే వాళ్ళకి విజ్ఞత లేదని ప్రతి నివేదికను కాలిక్యులేట్ చేసుకుంటే ఈరోజు ఎంతో అభివృద్ధి జరిగిందని తెలిపారు. 2019 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్లో పిఎఫ్ అకౌంట్ కలిగిన ఉద్యోగులు సంఖ్య 44.85 లక్షలు కాగా 2023 మార్చి నాటికి ఈ సంఖ్య 60.73 లక్షలకు పెరిగింది అంటే 2019 23 మధ్య 4 నెలలు 15.8 లక్షలు ఉద్యోగాలు పెరిగాయని 2019 నుంచి 23 మధ్య నాలుగేళ్లలో సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు జగనన్న ప్రభుత్వం ఇచ్చిందని ఇది అభివృద్ధి కాదా అని ఆయన మీడియా పూర్వకంగా తెలియజేశారు. ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలు సచివాలయాలు నూతనంగా నిర్మించారు అంటే అది అభివృద్ధి కాదా అని అడిగారు.
కాకినాడ రూరల్ గంగనాపల్లి గ్రామంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ ఆధ్వర్యంలో సుమారుగా 200 మంది వైసీపీ పార్టీ కు చెందిన కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. పంతం నానాజీ జనాసేన పార్టీ కండువాలు వేసి జనసేన పార్టీలో ఆహ్వానించారు. పంతం నానాజీ, తెలుగుదేశం పార్టీ నాయకులు చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైసిపి పార్టీ మీద ప్రజలకు నమ్మకం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వలనే రాష్ట్రంలో సంక్షేమం ,సుపరిపాలన సాధ్యమని ప్రజలు గ్రహించారు అని అన్నారు. ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్ది వైసీపీ ప్రభుత్వం ఖాళీ అవటం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు కర్రేడ్ల గోవింద్, తడాల అబ్బు, కుర్ర నాగేశ్వరరావు, పుల్ల శ్రీరాములు, మాదరపు తాతాజీ, సిరంగు శ్రీనివాసరావు, తాటికాయలు వీరబాబు, సోదే ముసలయ్య జనసేన కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ కోనసీమజిల్లా రాజోలులో బీసీమంత్రి చెల్లుబోయిన వేణు (chelluboyina venu) పై ఘాటు వ్యాఖ్యలు చేశారు, టీడీపీ నేత వాసంశెట్టి శుభాష్. మంగళగిరిలో జనసేన (Janasena) – టీడీపీ(TDP) ఆధ్వర్యంలో జరిగిన జయహో బీసీ డిక్లరేషన్ సభ విజయవంతం కావటంపై, వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది అన్నారు. జయహో బీసీ (Jayaho BC) సభ విజయవంతం పై బీసీ శాఖ మాత్యులు వేణు మాట్లాడుతూ… టీడీపీ పార్టీని ఎవరు నమ్మరు అని, ఆ పార్టీ వంచన చేస్తుందని అనడం జరిగింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఆయనకు ఒకటి చెప్తాను సూటిగా అయ్యా మీరు బీసీ సంక్షేమ మంత్రిగా చేస్తున్నారు. మరి మీ సొంత సామాజికవర్గం శెట్టిబలిజ సామాజికవర్గం వారికి గానీ, అందులో కులవృత్తులు లో ఉన్నవారికి గానీ, ఈ ఐదు సంవత్సరాలులో మీరు ఏమి చేశారని అన్నారు. మీ సొంత కులన్నే మీరు విస్మరించారు. మరి ఈ విషయాల గురించి మీరు ఇలా ఎలా మాట్లాడతారు, మీరే చెప్పుకుంటూ వస్తున్నారు అని ఎద్దేవా చేశారు. పాతతరం నాయకుల గా విమర్శించడానికి కూడా ఏమి లేక ఆ మతిభ్రమించినట్లు మాట్లాడుతున్నారు మీరు. అలాగే స్థానిక సంస్థల రిజర్వేషన్లు కూడా 34% నుంచి 24% తీసుకొచ్చిన ఘనత వైసీపీ పార్టీది అని అన్నారు.
ఇది చదవండి: వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం రంప గ్రామంలో అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున శివరాత్రి మహోత్సవాలు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారు 12వ శతాబ్దానికి చెందిన దేవాలయం ఇది చోళ రాజులు పరిపాలించినప్పుడు ఈ దేవాలయం నిర్మించబడింది. అంతేకాకుండా ఈ దేవాలయం అల్లూరి సీతారామరాజు ఇక్కడ పూజలు నిర్వహించి తన స్వతంత్ర యాత్రను ఈ మన్యంలో కొనసాగించారని ఇక్కడ పెద్దలు అంటారు. అంతేకాకుండా ప్రతి ఏటా వివిధ రాష్ట్రాల నుంచి ఈ పురాతన శివాలయాన్ని సందర్శించడానికి భక్తులు శివరాత్రి రోజు వస్తారు. సుమారు శివరాత్రి మహోత్సవాలు పురస్కరించుకొని వేళలో భక్తులు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. అంతేకాకుండా భక్తుల కోర్కెలను నెరవేరిచే దైవంగా ఇక్కడ మన్యం ప్రజలు కొలుస్తారు.
మహాశివరాత్రి (Mahashivratri) :
మహాశివరాత్రి (Mahashivratri) సందర్భంగా కాకినాడ జిల్లాలోని పంచారామ క్షేత్రం సామర్లకోట శ్రీ కుమార రామ భీమేశ్వర ఆలయంలో ఉత్సవాలు ఘనంగా జరిపేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీ బుధవారం నుంచి 11వ తేదీ సోమవారం వరకూ మహా శివరాత్రి ఉత్సవాలు జరగనున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి బళ్ళ నీలకంఠం తెలిపారు. శివరాత్రి ఉత్సవాల్లో భక్తుల సౌకార్యార్థం అన్ని ఏర్పాట్లు దేవాదాయ శాఖ అధికారులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఈవో నీలకంఠం మీడియాతో మాట్లాడుతూ 6వ తేదీ బుధవారం ఉదయం 9.25 గంటలకు విగ్నేశ్వర పూజ, అంకురార్పనతో మహా శివరాత్రి పూజలు ప్రారంభిస్తుండగా రాత్రి 9.20 గంటలకు స్వామివారి దివ్య కళ్యాణం జరగనున్నట్టు చెప్పారు. అలాగే 7వ తేదీన స్వామి వారికి, అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చనలు, సాయంత్రం నీరాజన మంత్ర పుష్పములు నిర్వహించనున్నట్టు చెప్పారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ముఖ్యంగా 8వ తేదీ మహా శివరాత్రి పర్వదినం కావడంతో తెల్లవారు జాము ఒంటి గంట నుంచి స్వామివారి మూల విరాట్ నందు అభిషేక పూజలు జరగనున్నట్టు చెప్పారు. అలాగే రాత్రి 10 గంటల నుంచి స్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, లింగోద్భావ కాల పూజ, పిఠాపురం రాజా వారి గోత్ర నామాలతో నిర్వహించనున్నట్లు చెప్పారు. 9వ తేదీ శనివారం మధ్యాహ్నం 3.20 గంటల నుంచి స్వామివారి రధోత్సవం కన్నుల పండుగగా పుర వీదుల్లో నిర్వహించనున్నట్టు ఈవో తెలిపారు. 10వ తేదీన స్వామివారికి, అమ్మవారికి త్రిసూల స్నానం, తీర్దపు సేవ నిర్వహించనున్నట్టు చెప్పారు. తదుపరి 11వ తేదీ సోమవారం రాత్రి 7.45 గంటల నుంచి స్వామి వారికి, అమ్మవారికి శ్రీ పుష్ప యోగోత్సవం పూజలు ఘనంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ పూజాలతో ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ అధికారి నీలకంఠం వివరించారు. అలాగే ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రతీరోజు రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. కాగా మహా శివరాత్రి ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి రానుండడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు, సేవా కార్యక్రమాలు, భారీ బందోబస్తు, స్వచ్ఛంద సంస్థల సేవలు అందుబాటులో ఉంచుతున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి నీలకంఠం తెలిపారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
అధిక వర్షాలు, తుఫాన్ లతో తొలకరి పంట తుడిచిపెట్టుకు పోతుంటే… సమయానికి సాగు నీరందక దాల్వ పంట చేలు బీడు భారడం, వేసిన పంట పొట్ట దశకు రాకుండా నే ఎండి పోతుండటంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. సాగు నీరు సక్రమంగా సరఫరాకు దోహదం చేసే పంట కాల్వలు, బోదెలు ఆధునికీకరణకు నోచుకోక పోవడం ముంపు నీరు దిగేందుకు దోహదం చేసే మేజర్, మైనర్ డ్రయిన్స్ లలో పేరుకు పోయిన పూడిక తీసేవారు లేకపోవడం అతివృష్టి, అనావృష్టి సమయాల్లో రైతులుకు శాపంగా మారుతోంది. ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రస్తుతం సాగునీటి ఎద్ధడితో రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
నియోజకవర్గ పరిధిలోని ఐ పోలవరం మండలం, కాట్రేనికోన మండలం, ముమ్మిడివరం మండలాల్లో శివారు ప్రాంతాలకు, ఎత్తెన ప్రాంతాలకు సాగు నీరు అందకపోవడం, మోటార్ల ద్వారా సాగునీరు మల్లించుకుందామంటే అసలు పంట కాల్వల్లోనే సాగు నీరు అడుగంటడం రైతులుకు శాపంగా మారింది.
ఐ పోలవరం మండలం పాత ఇంజరం గ్రామంలో ఐతే పూర్తి గా ఆరిపోయి ఉన్న వరి పొలంలో రైతులు కూర్చుని సాగునీరు ఇచ్చి రైతులును ఆదుకోవాలని నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు. ఎకరాకు ముప్తె వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు ఆ పెట్టుబడులు సైతం దక్కే దారి లేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దిక్కుతోచకుండా ఉందని రైతులు వాపోతున్నారు. వరుస పంట నష్టాలతో అప్పులు పాలై, పెట్టు బడులు రాక, కౌలు శిస్తులు చెల్లుంచుకోలేక నలిగి పోతున్నామని రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
ప్రత్తిపాడులో నియెజకవర్గ స్థాయి వైసీపీ పార్టీ సిద్ధం సభను స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా mlc అనంత ఉదయ భాస్కర్, కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చలమలశెట్టి సునీల్, జోనల్ వింగ్ యువత అధ్యక్షుడు జక్కంపూడి గణేష్ లు హాజరయ్యారు. ఈ సిద్ధం సభకు నాలుగు మండలంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు వేలాది సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాష్టంలో వైసీపీ పార్టీని 175 నియెజకవర్గాలలో గెలుపొందే దిశగా ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితులు లో రాష్ట్ర ప్రజలు లేరని అన్నారు. కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి సునీల్ ను ప్రత్తిపాడు నియెజకవర్గములో వరుపుల సుబ్బారావు ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి తోనే రాష్ట్రంలో ప్రజలకు మచి జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు.
టిడిపి జనసేన పొత్తులో భాగంగా రూరల్ నియోజకవర్గం సీటు జనసేన కు కేటాయించడంతో టిడిపి నాయకులు కార్యకర్తలు అసహనానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో టిడిపి జోన్2 ఇంఛార్జి సుజయ కృష్ణ రంగారావు, కాకినాడ రూరల్ వలసపాకల పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి నివాసానికి వచ్చారు. టిడిపి నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. రూరల్ నియోజకవర్గాన్ని అన్నివిధాల అభివృధి పదంలో నడిపించిన పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి నాయకత్వం, బిసి సామాజిక వర్గానికి చెందిన వర్కి నియోజకవర్గం లో ఉన్న గుర్తింపు పట్టు రంగారావు దృష్టికి నాయకులు కార్యకర్తలు తీసుకువచ్చారు. అనంతరం రంగారావు మీడియా తో మాట్లాడుతూ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతులకు పార్టీలో ఎప్పుడు సముచిత స్థానం ఉందని, ఇక్కడ క్షేత్ర స్థాయిలో నాయకులు, కార్యకర్తల్లో ఉన్న అపోహలు, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని ఎది ఏమైనా రాబోయే రోజుల్లో అందరి సమిష్టిగా కృషి చేసి జనసేన అభ్యర్థిని అఖండ మెజార్టీ తో గెలిపుంచుకుంటామని తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం జగ్గంపేట నియోజకవర్గం లో తనకున్న కేడర్ అనుచరులతో 2.5 కోట్లతో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్ ను ఎమ్మెల్యే చంటిబాబు ఓపినింగ్ చేయించారు. విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద వైసీపీ ఇంచార్జ్ తోట నరసింహం, ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ప్లెక్సీ లేకుండా చంటిబాబు ప్లెక్సీలతోనే ప్రారంభించడం తో వైసీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం వద్ద ఎమ్మెల్యే చంటిబాబు పక్కనే ఎంపీ వంగా గీత ప్లెక్సీలు ఉన్నా ఆమె హాజరు కాకపోవడంతో వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటిబాబు కొన్ని వ్యాఖ్యలు చేసారు. అధికారులు ప్రోటోకాల్ లేకపోయినా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంలో ఇంచార్జ్ నరసింహం కలిసి వచ్చిన లేకపోయినా నేను చేపట్టిన అన్ని ఒక్కటిగా ప్రారంభిస్తున్నాను.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
జగ్గంపేటలో ఇంచార్జ్ గా తోట నరసింహం వచ్చే ఎన్నికల్లో నాతో, నా కేడర్ తో సమన్వయంతో మాట్లాడితే కలిసి పనిచేస్తాం. వైసీపీ లో నేను ఎమ్మెల్యే గా ఉన్నాను అయినప్పటికీ ఇంచార్జ్ తోట నరసింహం ఇప్పటి వరకు నన్ను కలవనే లేదు. ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ అందరిని కలుపుకునేపోతున్నారు. నరసింహం కలుపుకునే ఆలోచనలో లేనట్లున్నారు. నా కూడా తిరుగుతున్న కొందరిని తీసేసి తోట నరసింహం తన అనుచరులకు చిన్న చిన్న పదవులు ఇవ్వడంతో పార్టీ శ్రేణుల్లో కొంత అసహనం కనిపిస్తుంది. నేను పార్టీ కోసం పనిచేస్తాను. నేను పార్టీ మారడం జరగదు. నన్ను పార్టీ నుండి గెంటేస్తే తప్ప ప్రస్తుతం నియోజకవర్గంలో అదే ధోరణి నడుస్తోంది ఇది జగన్ గమనించాలి. నేను నా ఊరు ఇర్రిపాక వదిలి ఎక్కడికి పోను ఉంటే రాజకీయంగా రాజకీయాల్లో ఉంటాను. లేదంటే వ్యవసాయం చేసుకుంటాను. తోట నరసింహం గారు నన్ను కలవడానికి ఇబ్బందిగా ఉంటే వయసులో ఆయన నాకు పెద్దాయన ఆయనను కలిసి మాట్లాడి ముందుకెల్దామంటే నేనే ఆయన ఇంటికెళ్లి కలుస్తాను.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి : NTPC: ఎన్టీపీసీ ను నేడు జాతికి అంకితం చేయనున్న మోదీ.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి




Total views : 92161