అంగన్వాడి వర్కర్స్ సమస్యలు పరిష్కారం కోసం సెంటర్స్ క్లోజ్ చేసి సమ్మె చేశారు. రేపల్లె ప్రాజెక్ట్ ఆఫీస్ వద్ద శిబిరం ఏర్పాటు చేసుకొని ఏపి అంగన్వాడి వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ సిఐటియు ధర్నా చేశారు. ఈ సదర్భంగా అంగన్వాడీ వర్కర్స్, అండ్ హెల్పర్స్, యూనియన్ సీఐటీయూ ప్రాజెక్టు గౌరవాధ్యక్షులు సిహెచ్.మణిలాల్ లు మాట్లాడుతూ సమ్మెలోకి వెళుతున్నట్లు సమ్మె నోటీసులు పలుదపాలు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం స్పదించకపోవటంతో తప్పని పరిస్థితుల్లో సమ్మె చేయాల్సినా పరిస్థితి వచ్చిందని, రోజువారి పని ఒత్తిడి పెరగటం మరియు యాప్స్ పేరుతో తీవ్రమైన ఇబ్బందులు అంగన్వాడి వర్కర్స్ పడుతున్నారు అని అన్నారు. రోజువారీ ధరలు పెద్ద ఎత్తున పెరుగుతున్నవి, అయినప్పటికీ వేతనాలు పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణా కన్నా 1000 ఎక్కవ వేతనం ఇస్తామన్నా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేస్తుందన్నారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం, లబ్ధిదారులకు అవసరమైన నాణ్యమైన ఫుడ్ సరఫరా చేయటం లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక పలుదఫాలు ఆందోళన చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో సెంటర్స్ క్లోజ్ చేసి సమ్మెలో చేయలిసినా పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలకు పిలిచి అంగన్వాడీలా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Guntur
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం, మానుకొండవారిపాలెంలో తుఫాన్ కు దెబ్బతిన్న శనగ, పొగాకు, మిరప, వరి కల్లాలను తెదేపా రాష్ట్ర బృందంతో కలిసి మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. అనంతరం రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడుతూ రైతుకు భరోసా కల్పించి ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం ఇప్పించేందుకు వచ్చామన్నారు. అన్నదాత కష్టాల్లో ఉంటే దెబ్బతిన్న పంటల పరిశీలనకు చంద్రబాబు షెడ్యూల్ ప్రకటించిన తర్వాత జగన్రెడ్డి కదిలారని మండిపడ్డారు. ఎక్కడా కూడా పొలాల్లోకి దిగిన దాఖలాలు లేవన్నారు. కాలికి మట్టి అంటకుండా తిరిగితే రైతుల సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. పంట నష్టపోయి అన్నదాతలు నిద్రల్లేని రాత్రులు గడుపుతుంటే జగన్కు ఎవరిని ఎక్కడికి మార్చాలి.. మళ్లీ అధికారంలోకి రావాలనే ధ్యాస తప్ప మరొకటి లేదన్నారు. ఏ పంటకు ఎంత నష్టపరిహారం ఇస్తారో ప్రకటనే చేయలేదన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, ఈ-క్రాపింగ్ ఎంత బుక్ చేశారో కూడా చెప్పడం లేదని… ఇదెక్కడి దిక్కుమాలిన ప్రభుత్వమో అర్థం కావడం లేదన్నారు. పంట దెబ్బతిన్న 22 లక్షల ఎకరాల్లో ఈ-క్రాపింగ్ బుకింగ్ ఎంత వస్తుంది.. రాని వారికి, కౌలుదార్లకు ప్రభుత్వం ఎంత చెల్లిస్తుందనే వాటిపైనా ఏమీ చెప్పలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్రాంతి లోపు చెల్లిస్తామని చెబుతున్నారని.. ఈలోపు ఇవ్వకపోతే జనవరి 20 తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చి జగన్రెడ్డి తప్పించుకునే అవకాశం ఉందన్నారు. కాబట్టి తక్షణమే రైతులకు నష్టపరిహారం ప్రకటించాలని, తడిసినధాన్యం, మిరప కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగానే వైకాపాలో అభ్యర్థుల మార్పులపైనా చురకలు వేశారు. చెల్లని రూపాయి ఎక్కడ ఉన్నా చెల్లనిదే అని అన్నారు. స్థానాలు మార్చినంత మాత్రాన వాళ్ల అవినీతి, అక్రమాల చరిత్రలు చెరిగిపోవు అన్నారు. చిలకలూరిపేటలో మంత్రి విడదల రజిని చేసిన అవినీతి, దుర్మార్గాల్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని చెప్పారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏడుగురిని మార్చారని.. అభ్యర్థులను మార్చినంత మాత్రానా వారు చేసిన అవినీతి, దుర్మార్గాలు ఎక్కడిపోతాయని ప్రశ్నించారు.
పల్నాడు జిల్లా గురజాలలో అంగన్వాడీలకు జీతాలు పెంపు పై ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో నేటి నుంచి అన్ని అంగన్వాడీ సెంటర్ల మూసివేసి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ముందుగా స్థానిక ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద నుండి గురజాల రెవిన్యూ డివిజన్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తమ జీతాలు వెంటనే పెంచాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ముఖ్యంగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువగా జీతం ఇస్తామని హామీ ఇచ్చారని , కానీ ఇంత వరకు జీతాలు పెంచలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మా డిమాండ్లను పరిష్కరించాలని లేకపోతే ఈ సమ్మెను కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.
జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ టైకూన్ జంక్షన్ పరిశీలనకు వచ్చిన నాదెండ్ల మనోహర్ ను అక్రమంగా అరెస్టు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రశ్నించిన వారిని పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని అరెస్టులు చేస్తున్నారు. రాష్ట్రంలో క్రిస్టియన్ మైనార్టీ భూములను కూడా ఆక్రమించుకుని దోచేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వలపేక్షతో కాకుండా రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగిందని తెలిపారు. మంగళగిరిలో ఓటమి భయంతోనే బీసీ కార్డును తెరపైకి తెచ్చారని మంగళగిరిలో వైసిపి ఓటమికి జనసేన కచ్చితంగా ప్రభావితం చేస్తుందని రాజకీయ దురుద్దేశంతోనే బీసీలను తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు. రాబోయే రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే మంగళగిరిలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఎన్నికల పోటీ చేసే విషయంలో జనసేన పార్టీ అధిష్టాన నిర్ణయమే మాకు శిరోధార్యమని తెలిపారు.
గుంటూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల ఇన్చార్జిల మార్పుపై అసంతృప్తి సెగలు. ఇన్చార్జిలో మార్పు పట్ల ఇప్పటికే నియోజకవర్గాల్లో సమావేశం చేస్తున్న ప్రస్తుత సిట్టింగ్ ఇంచార్జలు ఎమ్మెల్యేలు. భవిష్యత్తు కార్యాచరణ పై కార్యకర్తలతో సమావేశాలు. ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లో ఎమ్మెల్యే మద్దాలి గిరిని మార్చడంపై మాట్లాడంపై సమావేశం అవుతున్న ఆర్యవైశ్యులు. సమావేశంపై ఉత్కంఠ. మద్దాలగిరికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సీటు కేటాయించకపోతే రాజీనామా చేయాలంటూ ఒత్తిడి తెస్తున్న ఆర్యవైశ్యులు..
పల్నాడు జిల్లా గురజాల పట్టణంలోని 12 , 13 వార్డులలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా యరపతినేనికి స్థానిక టీడీపీ , జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు గడప గడపకు వెళ్లి రేపు రాబోయే టీడీపీ ప్రభుత్వంలో అమలుచేసే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం యరపతినేని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహానాడు కార్యక్రమంలో భాగంగా మహిళలు కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని అందులో భాగంగానే సంవత్సరానికి 4 సిలిండర్లను అందిస్తున్నారని వారు తెలిపారు. దాంతో పాటు గురజాల నియోజకవర్గం మొత్తానికి రేపు అధికారంలోకి రాగానే మరొక సిలిండర్ కూడా ఇవ్వబోతున్నట్లు యరపతినేని తెలిపారు. జనసేన మరియు టిడిపి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని వారు తెలిపారు. రేపు రాబోయే ఎన్నికల్లో టిడిపి మరియు జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించాలని వారు కోరారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మల్లెల రాజేష్ నాయుడు (Mallela Rajesh Naidu)
చిలకలూరిపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మల్లెల రాజేష్ నాయుడు పేరు ఖరారు చేస్తూ అధిష్టానం సోమవారం నాడు ప్రకటించింది. ఈ సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలో పండగ వాతావరణం నెలకొంది. మల్లెల రాజేష్ నాయుడు అభిమానులు ఆనందోత్సాహాలతో టపాకాయలు పేలుస్తూ పేట ప్రాంతాన్ని సువర్ణ కాంతులతో వెలిగిస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పవన్ ఫ్యామిలీ జోలికి వస్తే పగిలిపోద్ది..నాగబాబు మాస్ వార్నింగ్ | Nagababu Mass Warning To YCP | CVR
ఈసారి ఎలాగైనా టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ను ఓడించేందుకు నేరుగా సీఎం జగన్ రంగంలోకి దిగారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణకు నియోజకవర్గంలో మంచి పేరు ఉన్నప్పటికీ గౌడ సామాజిక వర్గానికి దగ్గర కాలేకపోయారు. దీంతో రెండుసార్లు వైసిపి ఓటమి పాలు కావాల్సి వచ్చింది. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్టు ప్రత్యర్థిని. రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన నేతనే జగన్ ఎంచుకున్నారు. దీనిలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో అప్పటి కూచినపూడి నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా 1985, 1989, 1994లో ఎమ్మెల్యే గా ఎంపికై, మంత్రిగా పనిచేసిన ఈవూరి సీతారావమ్మ తనయుడు డాక్టర్ ఈవూరి గణేష్ దంపతులను వైసీపీ అధిష్టానం దగ్గరకు తీసుకుంది. స్వయంగా సీఎం జగన్ గత నెల 15 న వారిని పార్టీలోకి సాదరంగా చేర్చుకున్నారు.
అప్పట్లో పిఆర్పీ అభ్యర్థిగా గౌడ సామాజిక వర్గానికి చెందిన గణేష్ 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక వైసిపి ఇన్చార్జ్ ఎంపీ మోపిదేవి వెంకటరమణ రావు 2019 ఎన్నికల్లో ఓటమి చెందడంతో వైసీపీ అధిష్టానం రేపల్లె నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా వైసీపీ జెండా ఎగుర వేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో డాక్టర్ ఈవూరి గణేష్ ను పార్టీలోకి తీసుకుని ఇంచార్జీ భాద్యతలు అప్పగించారు. ఎంపీ గానే కొనసాగనున్న మోపిదేవికి రాజ్యసభ సభ్యత్వం ఉండడంతో అతని స్థానంలో ఈపూరు గణేష్ కు అవకాశం ఇచ్చేందుకు పార్టీలోకి తీసుకున్నారనే ప్రచారం అప్పట్లోజోరుగా సాగింది. నేడు ఇంచార్జీ గా ప్రకటించి వైసీపీ శ్రేణుల్లో కలవరం సృష్టించింది.
తమ అథినేత నాదెండ్ల మనోహర్ ను విశాఖపట్నం టైకూన్ సెంటర్లో వైజాగ్ పోలీసులు నిర్భందించినందుకు తెనాలిలో జనసైనికులు, వీరనారీమణులు, తెదేపా సభ్యులు ఆందోళనకూ దిగి మార్కెట్ సెంటర్లో రాస్తారోకో చేసి థర్నాకు దిగారు. తర్వాత జనసేన PAC ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ను వదలివేయటం జరిగింది. ఏమిటీ విశాఖ టైకూన్ సెంటర్ వివాదం ? విశాఖపట్నంలోని సిరిపురం జంక్షన్ నుండి విఐపి రోడ్డుకు వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసేసారు. నాలుగు నెలల క్రితమే టైకూన్ సెంటర్ వద్ద రోడ్డును మూసేసారు. అయితే ఇలా హటాత్తుగా ప్రజలు ఉపయోగించే రోడ్డును మూసేయాడానికి, ఇదే రోడ్డులో నిర్మిస్తున్న వైసిపి ఎంపి ఎంవివి సత్యనారాయణకి భవనమే కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ భవనానికి వాస్తు దోషం వుందని ఏకంగా రోడ్డునే మూసేసారని ఆరోపిస్తున్నారు. ప్రజా ప్రతినిధుల ఆస్తులను అధికారులు ప్రజలు ఉపయోగించే రోడ్డును మూసేయడం దారుణమని జనసేన నాయకులు అంటున్నారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికి వెళ్తున్న పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ని అడ్డుకొని అరెస్టు చేయడం అక్రమం అని అన్నారు. వైజాగ్ ఎంపీ లేఅవుట్ వేశారు. దాన్ని కి అన్ని హంగులు సమకూర్చి అమ్ముకోవటానికి, వాస్తు అడ్డు వచ్చినదాని రోడ్డు మూశారు. ఆ రోడ్డు వల్ల ప్రజలు నాలుగైదు కిలోమీటర్లు తిరిగి రావాల్సి వచ్చింది. దాన్ని ప్రశ్నించడానికి వెళ్తున్న నాదెండ్ల మనోహర అడ్డుకొని, అరెస్టు చేయటం హేయమైన చర్య అని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కుని కాలరాయకూడదు. పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అరెస్టు చేయటానికి బోర్ర వెంకట అప్పారావు తీవ్రంగా ఖండించారు