Thursday, March 12, 2026
News Navigation

Breaking

Thursday, March 12, 2026
Home Andhra Pradesh డాక్టర్ గణేష్ కి రేపల్లె వైసీపీ టికెట్…

డాక్టర్ గణేష్ కి రేపల్లె వైసీపీ టికెట్…

by Prakash
Repalle YCP ticket for Dr. Ganesh...

ఈసారి ఎలాగైనా టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ను ఓడించేందుకు నేరుగా సీఎం జగన్ రంగంలోకి దిగారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణకు నియోజకవర్గంలో మంచి పేరు ఉన్నప్పటికీ గౌడ సామాజిక వర్గానికి దగ్గర కాలేకపోయారు. దీంతో రెండుసార్లు వైసిపి ఓటమి పాలు కావాల్సి వచ్చింది. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్టు ప్రత్యర్థిని. రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన నేతనే జగన్ ఎంచుకున్నారు. దీనిలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో అప్పటి కూచినపూడి నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా 1985, 1989, 1994లో ఎమ్మెల్యే గా ఎంపికై, మంత్రిగా పనిచేసిన ఈవూరి సీతారావమ్మ తనయుడు డాక్టర్ ఈవూరి గణేష్ దంపతులను వైసీపీ అధిష్టానం దగ్గరకు తీసుకుంది. స్వయంగా సీఎం జగన్ గత నెల 15 న వారిని పార్టీలోకి సాదరంగా చేర్చుకున్నారు.

అప్పట్లో పిఆర్పీ అభ్యర్థిగా గౌడ సామాజిక వర్గానికి చెందిన గణేష్ 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక వైసిపి ఇన్చార్జ్ ఎంపీ మోపిదేవి వెంకటరమణ రావు 2019 ఎన్నికల్లో ఓటమి చెందడంతో వైసీపీ అధిష్టానం రేపల్లె నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా వైసీపీ జెండా ఎగుర వేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో డాక్టర్ ఈవూరి గణేష్ ను పార్టీలోకి తీసుకుని ఇంచార్జీ భాద్యతలు అప్పగించారు. ఎంపీ గానే కొనసాగనున్న మోపిదేవికి రాజ్యసభ సభ్యత్వం ఉండడంతో అతని స్థానంలో ఈపూరు గణేష్ కు అవకాశం ఇచ్చేందుకు పార్టీలోకి తీసుకున్నారనే ప్రచారం అప్పట్లోజోరుగా సాగింది. నేడు ఇంచార్జీ గా ప్రకటించి వైసీపీ శ్రేణుల్లో కలవరం సృష్టించింది.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.