Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra Pradesh ఎల్లవేళలా పేదలకు అండగా…..

ఎల్లవేళలా పేదలకు అండగా…..

by Prakash
MLA Srikanth Reddy

అన్నమయ్య జిల్లా రాయచోటి లో ఎల్లవేళలా తాము పేదలకు అండగా ఉంటామని ఎం ఎల్ ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ పరిధిలోని మాసాపేట 2 వ వార్డులో రూ 15 లక్షల నిధులతో సిసి రోడ్డు, 34 వ వార్డులో 80 లక్షల, గడప గడపకు మరియు మున్సిపల్ నిధులుతో పూర్తయిన సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ ల శిలాపలకాలను, రూ 9 లక్షల సోలార్ నిధులుతో మినరల్ వాటర్ ప్లాంట్, రూ 9 లక్షల మెప్మా సి ఆర్ సి భవన ప్రారంభాలను మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, కౌన్సిలర్లు సుగవాసి పద్మావతి, గూడూరు అమ్మాజీ తదితర నాయకులతో కలసి శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. భారీ జన సందోహం మధ్య, పండుగ వాతావరణంలో అభివృద్ధి పనుల ప్రారంబోత్సవాలను శ్రీకాంత్ రెడ్డి నిర్వహించారు. ఈ సంధర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అహంభావం, అహంకారం, రౌడీయిజం లేకుండా, సామరస్యంగా ఉంటూ మరింత బాధ్యత తో రాయచోటి ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. మాసాపేట ఒకప్పుడు ఎంతో వెనుకబడి ఉండేదని, జిల్లా కేంద్రం ఏర్పాటుతో నెంబర్ 1 స్థానంలో ఉందన్నారు. జగన్ పాలనలోఅర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. వందపడకల ఆసుపత్రి, 4 అర్బన్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్ స్టాండ్ విస్తరణ, డైట్ మున్సిపల్ పార్క్, రైతు బజార్, క్రికెట్ స్టేడియం, నగరవనం, శిల్పారామంలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. కరోనా సమయంలో ఎక్కడా భయపడకుండా ఆసుపత్రులలోకి వెళ్లి రోగులతో మమేకం అయ్యి, రోగులకు ధైర్యం కల్పించామన్నారు. రూ 30 లక్షల సొంత డబ్బులతో ఆనందయ్య మందును ఇంటింటా పంపిణీ చేసి ప్రజలకు తోడుగా నిలిచామన్నారు. చంద్రబాబు డ్వాక్రా రుణాలను మాపీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. సీఎం జగన్ 99 శాతానికి పైగా హామీలను నెరవేర్చారన్నారు. మాసాపేట అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారిస్తామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మాసాపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేసిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి కి స్థానిక కౌన్సిలర్లు, నాయకులు ఘన స్వాగతాలు పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ గంగా ప్రసాద్, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్, జి ఎం డి ఇమ్రాన్, జి ఎం డి ఇర్షాద్, సుగవాసి శ్యామ్, సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, కొలిమి హారూన్, విక్కీ దేవేంద్ర, జావీద్, అమీర్, కో ఆప్షన్ సభ్యులు అయ్యావారు రెడ్డి, హజరత్ ఖాదర్ వలీ, అన్నా సలీం, వాల్మీకి సంఘ జిల్లా అధ్యక్షుడు గువ్వల బుజ్జిబాబు, నూర్ బాష సంఘ జిల్లా అధ్యక్షుడు మౌలా, జె సి ఎస్ కన్వీనర్ నవరంగ్ నిస్సార్, ఆసీఫ్ అలీఖాన్, రౌనక్,మాజీ కో ఆప్షన్ జాఫర్ అలీ ఖాన్,ఆర్ట్స్ శంకర్, కొత్తిమీర ప్రసాద్, చాను, గగ్గుటూరి ఇబ్రహీం, జుళ్ళూ, బాబయ్య, మాజ్,మస్తాన్,ఖాదర్ వలీ, అబ్దుల్ రహీం ,షామీర్,అమీర్, ఖాదర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

019445
Total views : 90730

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.