పల్నాడు జిల్లా గురజాల పట్టణంలోని 12 , 13 వార్డులలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా యరపతినేనికి స్థానిక టీడీపీ , జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు గడప గడపకు వెళ్లి రేపు రాబోయే టీడీపీ ప్రభుత్వంలో అమలుచేసే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం యరపతినేని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహానాడు కార్యక్రమంలో భాగంగా మహిళలు కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని అందులో భాగంగానే సంవత్సరానికి 4 సిలిండర్లను అందిస్తున్నారని వారు తెలిపారు. దాంతో పాటు గురజాల నియోజకవర్గం మొత్తానికి రేపు అధికారంలోకి రాగానే మరొక సిలిండర్ కూడా ఇవ్వబోతున్నట్లు యరపతినేని తెలిపారు. జనసేన మరియు టిడిపి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని వారు తెలిపారు. రేపు రాబోయే ఎన్నికల్లో టిడిపి మరియు జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించాలని వారు కోరారు.
అధికారంలోకి రాగానే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి….
272
previous post






Total views : 91131