ఇంధన పొదుపు భవితకు భరోసానన్నారు జేసి ఫర్హాన్ అహమ్మద్, ఎ పి ఎస్ పి డి సి ఎల్ జిల్లా ఇంచార్జి అధికారి చంద్ర శేఖర్ రెడ్డి లు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటి ఎ పి ఎస్ పి డి సి ఎల్ కార్యాలయం నందు జిల్లా అధికారి చంద్ర శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంధన పొదుపు వారోత్సవాల ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలిలో అన్నమయ్య జిల్లా జేసి ఫర్హాన్ అహమ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి ర్యాలిలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇంధనం పొదుపు చేయాలంటూ నినాదాలు నిర్వహిస్తూ విద్యుత్ కార్యాలయం నుండి శివాలయం చెక్ పోస్ట్ సర్కిల్, యస్ యన్ కాలని మీదగా నేతాజీ కూడలి వరకు కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది దేశ వ్యాప్తంగా కుడా డిసెంబెర్ 14 నుండి 20 వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ యొక్క వారోత్సవాలలో ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు ఇంధనం దుర్వినియోగం చేయకుండా ఎలా ఆదా చేయాలనే విధంగా పలు రకాల అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ ర్యాలిలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చాంద్ భాషా, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ విజయ్ కుమార్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ నరేంద్ర నాథ్ రెడ్డి, వై నాగరాజు, నరేష్, గిరిధర్, రాజేష్, ఇతర అధికారులతో పాటు కార్మికులు పాల్గొన్నారు.
Kadapa
బద్వేల్ పట్టణంలో ఏపీ టైటిలింగ్ ల్యాండ్ యాక్టును ఉపసంహరించు కోవాలంటూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక న్యాయవాదులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సి వి ఎన్ ప్రసాద్, సీనియర్ న్యాయవాది దేవి రెడ్డి బ్రహ్మ రెడ్డి మాట్లాడుతూ…. ఈ ప్రభుత్వం న్యాయవ్యవస్థకు సంబంధించిన విధులను తగ్గిస్తూ న్యాయవ్యవస్థ ను నిర్వీర్యం చేస్తోందని, న్యాయస్థానాలు చేయాల్సిన అధికారాలను రెవిన్యూ వ్యవస్థకు కట్టబెట్టడం దారుణమని తెలిపారు. భూ సమస్యలు, సెక్షన్ 8 ప్రకారం న్యాయస్థానాల పరిధిలో లేకుండా, సిపిసి అండ్ ఎవిడెన్స్ యాక్ట్ లేకుండా, భూ సమస్యలు పరిష్కారం కావని అన్నారు. ఏపీ టైటిలింగ్ 2022 యాక్ట్ ఈ ప్రభుత్వం రద్దు చేయకపోతే భవిష్యత్తులో భూ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని, కావున ప్రభుత్వం వెంటనే ఈ జీవోను ఉపసంహరించుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్ కుమార్, రాజేశ్వరరావు, ఈసీ ఓబుల్ రెడ్డి, డివిఎస్సార్ కృష్ణ, రమణ రెడ్డి, తదితర న్యాయ వాదులు పాల్గొన్నారు.
కడప జిల్లా.. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ, సిఐటియు ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియాన్ల నాయకులు మాట్లాడుతూ.. అంగన్వాడి కార్యకర్తలకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 26 వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే అంగన్వాడి కేంద్రాలను మూసివేసి ఈరోజు రోడ్డుపైకి వచ్చామని దీనికి కారణం ప్రభుత్వమేనని చెప్పారు. 30 ఏళ్లుగా అంగన్వాడీ కార్యకర్తలుగా పనులు చేస్తున్నామని కేవలం 11 వేల రూపాయల జీతంతో ఎలా మా కుటుంబాలు పోషించుకోవాలని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం కంటే వెయ్యి రూపాయలు అదనంగా వేతనం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్టోర్ డీలర్లు పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల వద్ద దించకుండా వీధుల వెంట పరిగెత్తిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనకు ప్రజా సంఘాలు మద్దతు తెలిపారు.
చట్టాన్ని అతిక్రమించి నేరాలకు, అక్రమాలకూ పాల్పడే వారి పై ఉక్కుపాదం మోపుతామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం అన్నమయ్య జిల్లా రాయచోటి లో డిఎస్పి కార్యాలయాన్ని, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను కర్నూలు డి ఐ జి సెంథిల్ కుమార్, కలెక్టర్ గిరిషా పి ఎస్, స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తో కలిసి వారు ప్రారంభించారు. ముందుగా వారు పోలీస్ కమాండో గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత పోలీసు సిబ్బంది, ఇతరులు ఫ్లవర్ బుక్కేలతో పాటు శాలువాలతో సన్మానించి వారికీ ఘన స్వాగతం పలికారు. అనంతరం డిఎస్పి కార్యాలయం, ట్రాఫిక్ పోలిస్ స్టేషన్ లు నిర్మాణాలను వేగంగా పుర్తియ్యేందుకు సహకరించిన వారికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా, చట్టబద్దంగా తాము పని చేస్తున్నామని మాకు అన్ని రాజకీయ పార్టిలు సమానమేనని ఎ పార్టీ పట్ల వివక్షత చూపమని స్పష్టం చేశారు. ప్రజలకు మరింత చేరువై వారికీ మెరుగైన సేవలను అందిస్తామని చెప్పారు. ఇటివల వైఎస్సార్ కడప జిల్లాలో జరిగిన ఓ సంఘటన పట్ల పూర్తిగా విచారణ చేపట్టామని దోషులు ఎవ్వరైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఏర్పడిన జిల్లా పోలీసు సిబ్బంది కొరత లేకుండా సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. త్వరలోనే పోలీసు నియామకాలు చేపట్టి పోలీసు సిబ్బంది కొరత లేకుండా చేస్తామని తెలిపారు. గతంతో పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా నేరాల సంఖ్యా తగ్గు ముఖం పట్టిందని తెలియజేశారు. దిశా యాప్ ని సుమారు కోటి యాబై లక్షల మంది తమ సెల్ ఫోన్ లలో నమోదు చేసుకోన్నరన్నారు. దిని ద్వారా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారి పై క్షణికకాలంలోనే సమాచారం అందుతుందని, అలాంటి కామందులు, ఆకతాయిలకు దండన తప్పదని హెచ్చరించారు. ఇటివల కాలంలో అవగాహనా లోపంతో కుటుంబ కలహాలు ఎక్కువ అయ్యాయని భార్యాభర్తలు, కుటుంబ సభ్యులకు తగిన రీతిలో కౌన్సలింగ్ ఇచ్చి వారి కాపురాలు సజావుగా సాగేందుకు పోలీసులు కృషి చేస్తున్నారని చెప్పారు. అజాగ్రత్తల కారణంగానే, ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించి యువకులు అతివేగంగా వాహనాలు నడుపుతుండడంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు అన్నిరకాల చర్యలతో అడ్డుకట్ట వేస్తున్నామని వివరించారు. రాయచోటి పట్టణంలో మరొక పోలీసు స్టేషన్ కు అనుమతులు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తమను కోరారన్నారు. అందుకు త్వరలోనే పోలీసు స్టేషన్ ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలో ఈరోజు మధ్యాహ్నం, 1:50 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి తన వ్యక్తిగత కార్యకలాపాలు కొరకు తమ బంధువుల ఇంటికి వచ్చి వారితో సంప్రదింపులు జరిపి మధ్యాహ్నం భోజనం స్వీకరించారు. అనంతరం రాయచోటిలో ఏర్పాటుచేసిన డీయస్పీ కార్యాలయం ప్రారంభోత్సవానికి బయలుదేరి వెళ్లారు.ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించిన పోలీసు అధికారులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లా రాయచోటి లోని శ్రీ భద్ర కాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయం నందు రు.1.58 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న పశ్చిమ రాజగోపురం, సాలహరం నిర్మాణం శిలా ఫలకంను ప్రారంభించిన ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి… అదే విధంగా భక్తుల వసతి సౌకర్యార్థం రు.9.45 కోట్లతో రెసిడెన్షియల్ నిర్మాణానికి శిలాఫలకంను ప్రారంభించారు. బ్రహ్మోత్సవాలలో ఆలయం చుట్టూ స్వామి వారి రథం తిరిగేందుకు రు.38 లక్షలతో పూర్తయిన మాడ విధులను వారు ప్రారంభించి, అనంతరం అన్నదాన విరాళ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పోలం రెడ్డి విజయమ్మ, ఈఓ రమణా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాషా, అన్నమయ్య జిల్లా దేవాదాయ శాఖ అధికారి, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అయ్యప్ప స్వాములకు బిక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం, మేము పూర్వజన్మ సుకృతం గా భావిస్తున్నామన్నారు. భిన్నత్వంలో ఏకత్వం దేశ ప్రగతికి మూల సిద్ధాంతం తోనే మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిందన్నారు. వ్యవస్థాపకులు ఫారుక్ సిబ్లి, రాయచోటి డివిజన్ డిఎస్పి మహబూబ్ బాషా, అర్బన్ సి సుధాకర్ రెడ్డి, టిడిపి నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలు. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రాయచోటి మణికంఠ గిరి అయ్యప్ప స్వామి ఆలయం వద్ద మాల ధారణ ధరించిన అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైనార్టీ ఆకుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు ఫారుక్ సిబ్లీ తోపాటు రాయచోటి నియోజకవర్గం టిడిపి నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలు పాల్గొన్నారు. వీరికి ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అతిథులుగా హాజరైన వారికి స్వామి వారి దర్శనం కల్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురుస్వాములు బసిరెడ్డి సురేష్ జయశంకర స్వాములను శాలువాలతో సన్మానించి పూలమాలతో సత్కరించారు. అదేవిధంగా అతిథులుగా హాజరైన వారిని కూడా అయ్యప్ప స్వాములు ఘనంగా సన్మానించారు. అనంతరం అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని వీరు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కఠినమైన, దీక్ష నియమములతో అయ్యప్ప స్వామి మాలధారణ ధరించడం చాలా అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా సోదరుల వలె కలిసి మెలగాలన్నారు. ఒకరి సాంప్రదాయాలను ఒకరు గౌరవించుకుంటూ సాంప్రదాయ పండుగలను నిర్వహించుకోవాలన్నారు. దాతల సహకారంతో అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేసి మాల ధారణ ధరించిన స్వాములకు వసతి సౌకర్యాలతో పాటు బిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న ఆలయ నిర్వాహకులకు తమ పరిరక్షణ సమితి తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి షబ్బీర్, మీడియా కోఆర్డినేటర్ అన్వర్, అయ్యప్ప స్వాములు తదితరులు హాజరయ్యారు.
Read Also..
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం మాండవ్య నది ఒడ్డున వేలిసియిన్న అతి పురాతనమైన పుణ్యక్షేత్రం శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం నందు శ్రీశైలం వేద పండితులచే ఆలయ పశ్చిమ రాజగోపుర కుంభాభిషేక, సాలహార మహోత్సవ ,హోమం కార్యక్రమాలు శుక్రవారం నుంచి ఘనంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు జరుగుతున్నా హోమం, పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. వారికీ ఆలయ చైర్మన్ పొలం రెడ్డి విజయమ్మ వారి భర్త మున్సిపల్ వైస్ చైర్మన్ పోలం రెడ్డి దశరథ రామిరెడ్డి, ఆలయ ఈవో రమణా రెడ్డి ల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం శ్రీశైలం వేద పురోహితులు పరమేశ్వర స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్నా హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోనున్న వినాయకుడిని, అఘోర లింఘేస్వరుడు తో పాటు శ్రీ వీరభద్ర స్వామి అమ్మవార్లను దర్శించుకొన్నారు. వారికీ ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేని శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. స్వామి వారి ఆలయ చరిత్ర గురించి మాట్లాడుకునే విధంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం అన్నారు. ఆలయ అభివృద్దితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కావాల్సిన వసతి ఏర్పాట్లు తదితర అంశాల గురించి వారిని అడిగి తెలుసుకొన్నారు. ఆలయ చైర్మన్ పొలం రెడ్డి విజయమ్మ, ఈవో రమణా రెడ్డి, శ్రీశైలం వేదం పురోహితులు పరమేశ్వర స్వామి లు మాట్లాడుతూ 2019 లో సిఎం జగన్ మోహన్ రెడ్డి పశ్చిమ రాజ గోపురం నిర్మాణానికి శంఖుస్థాపన చేశారన్నారు. కానీ కరోనా వైరస్ కారణంగా ఆ కార్యక్రమం అప్పట్లో నిర్వహించలేకపోయామన్నారు. తిరిగి స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట ఎంపి మిథున్ రెడ్డి, కలెక్టర్ గిరిషా పీఎస్ కృషితో పశ్చిమ రాజగోపురం సాలహారం ల నిర్మాణాలకు రూ 1.58 కోట్ల నిధులు మంజూరై పనులు కూడా పూర్తి కావడంతో శుక్రవారం నుండి పశ్చిమ రాజగోపుర కుంభాభిషేక, సాలహార మహోత్సవ పూజలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు కర్ణాటక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నట్లు వారు తెలియజేశారు. అందరికి శ్రీ భద్ర కాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి సంపూర్ణ కృపా కటాక్షాల తో పాటు శ్రీ భ్రమ రాంబ మల్లి కార్జున ఆశీస్సులతో మెండుగా కలగాలని ఇటువంటి దైవ కార్యక్రమాలు ఎన్నెన్నో నిర్వహించాలని మనస్పూర్తిగా కోరుకొంటున్నామన్నారు. ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు నిత్యాన్నదాన కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ గంగాప్రసాద్, కమిటీ సభ్యులు రత్న శేఖర్ రెడ్డి, సంబేపల్లె నాయకులు వివి ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ ఆర్ ఐ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
ప్రొద్దుటూరులో ఈరోజు ప్రముఖ సినీ నటులు సీఎంఆర్ షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. సీఎంఆర్ యజమాని మాఊరి వెంకట రమణ ఆధ్వర్యంలో ప్రముఖ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, మరియు ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ ప్రారంభించారు. సినీ నటి పాయల్ రాజుపుత్, యాంకర్ రష్మి గౌతమ్ లు కొనుగోలు దారులు అభిమానుల మధ్య సందడి చేశారు. ఈ సందర్భంగా సినీ నటులు పాయల్ రాజపుత్, రష్మిగౌతమ్ మాట్లాడుతూ.. సిఎంఆర్ షాపింగ్ మాల్ నందు అందరికీ కావలసిన మంచి మంచి డిజైన్లలో దుస్తులు లభిస్తాయని అన్నారు. యజమాని మాఊరి వెంకట రమణ మాట్లాడుతూ.. రాయలసీమలోని అతిపెద్ద షాపింగ్ మాల్ ప్రొద్దుటూరు లో అన్ని హంగులతో, కొత్త కొత్త డిజైన్లతో ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. హీరోయిన్ పాయల్ రాజపుత్, యాంకర్ గౌతమ్ రష్మీలను చూడటానికి అభిమానులు తరలి వచ్చారు.
కార్పోరేట్ కు ధీటుగా రాయచోటి వంద పడకల ఆసుపత్రిని తీర్చిదిద్దుదామని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం జరిగిన రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడి హోదాలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, వైస్ చైర్మన్ ఫయాజర్ రెహమాన్, కమిటీ సభ్యులు బేపారి మహమ్మద్ ఖాన్, ఫమీదా లతో కలసి ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారన్నారు. ఇక్కడి పనిచేస్తున్న వైద్యాధికారులు, సిబ్బంది సమిష్టి కృషితో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి అంటే రోగులకు ధైర్యం, నమ్మకం భరోసా కలిగేలా సేవలు అందేలా చూడాలన్నారు. లీవ్, డిప్యుటేషన్ల తో ఖాళీ వైద్యుల పోస్టులను త్వరిత గతిన భర్తీ చేసుకోవాలన్నారు. వంద పడకల ఆసుపత్రి ప్రారంభానికి ముందే, ఇప్పటి నుంచే వసతులను పెంచాలన్నారు. మూడు ఆపరేషన్ థియేటర్లను అందుబాటులోకి త్వరగా తీసుకు రావాలన్నారు. ఏసీ లు, లిఫ్ట్ ల ఏర్పాటుపై చర్చించారు ఆక్సిజన్ ప్లాంట్ వాడకంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఏయే విభాగాలకు ఎన్నెన్ని ఆక్సిజన్ బెడ్లు అవసరమో ఆయన ఆసుపత్రి పర్యవేక్షకుడు డా టి డేవిడ్ సుకుమార్ మరియు వైద్యాధికారులను ఆరా తీశారు. ఆక్సిజన్ ను నిల్వ ఉంచే ఏర్పాట్లపై చర్చించారు. సమిష్టి కృషి సహకారంతో రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలను కల్పించాలన్నారు. వైద్య పరీక్షల నిర్వహణపై ఆయన ఆరా తీశారు. నూతన భవనాలలో సోమవారం నుంచే వైద్య సేవలు ప్రారంభం కావాలన్నారు.విభాగాల కేటాయింపు, వైద్య పరికరాలు ఏర్పాటు చర్యలను ఇప్పటి నుంచే ప్రారంభించాలన్నారు. త్రాగునీటి సరఫరా చర్యలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రోజూ సుమారు 750 మంది కి పైగా ఓపి కి రోగులు వస్తున్నారని,వారికి నాణ్యమైన, సంతృప్తికరమైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. అల్ట్రా సౌండ్ పరీక్షలలో మహిళలకోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. మెడికల్స్, సర్జికల్ విభాగాల నిర్వహణకు ఏడాదికి రూ 80 లక్షల మేర వ్యయం అవుతుందని అధికారులు తెలిపారు. ట్రామా కేర్, కార్డియాలజీ సేవల ఏర్పాటుకు కృషి చేద్దామన్నారు. ఆసుపత్రి పరిశుభ్రత,పారిశుధ్యం మెరుగణకు మరింత చర్యలు చేపట్టాలన్నారు. ఆర్చి, రహదారుల నిర్మాణాలపై ఆయన ఆరా తీశారు.ఈ నెల 17 నుంచి 21 వ తేదీలోగా వందపడకల ఆసుపత్రి భవన నిర్మాణాల ను ప్రారంభించేందుకు సిద్ధమవుదామన్నార. డయాల్ సిస్ కేంద్రం మరింత అభివృద్ధికి కృషి చేస్తామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.ప్రస్తుతం ఉన్న డయాల్ సిస్ కేంద్ర భవనాన్ని కూడా నూతన భవనాలలోని అన్ని వసతులుతో కూడిన భవనంలోకి మార్చాలన్నారు. ప్రారంభానికి సిద్దమవుతున్న నూతన భవనాలను శ్రీకాంత్ రెడ్డి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్చిలు, రహదారుల నిర్మాణాలను పరిశీలించారు.ఆసుపత్రి ప్రాంగణంలో మంచి చెట్లు నాటి పచ్చదనం పెంపొందించాలని మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, వైద్యాధికారులుకు ఆయన సూచించారు.మానసిక ప్రశాంతత, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేలా చేద్దామన్నారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డా బండారు కిరణ్ కుమార్, డా రెడ్డి మహేశ్వర రాజు, డా రెడ్డి భాస్కర్ రెడ్డి, డా లక్ష్మీ ప్రసాద్, డా కోటేశ్వరి,డా ఖదీర్,ఏ పి ఎం ఎస్ ఐ డి సి డిఈ రాజగోపాల్ రెడ్డి,కౌన్సిలర్లు ఆసీఫ్ అలీఖాన్, కొలిమి ఛాన్ బాష, షబ్బీర్, ఫయాజ్ అహమ్మద్,రియాజ్, గౌస్ ఖాన్, కసిరెడ్డి వెంకట నరసింహా రెడ్డి, అన్నా సలీం,కొత్తపల్లె ఇంతియాజ్. తదితరులు పాల్గొన్నారు.





Total views : 194510