Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Andhra Pradesh సంచలనం సృష్టిస్తున్న శ్రీనివాసరెడ్డి

సంచలనం సృష్టిస్తున్న శ్రీనివాసరెడ్డి

by Satya
Balineni Srinivasa Reddy

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల తెలంగాణ ఎన్నికల సందర్భంగా తాను కాంగ్రెస్ గెలుస్తుందని 50 లక్షలు పందెం కాశానని, కానీ తన కుమారుడు ప్రణీత్ రెడ్డి బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పడంతో ఆ పందెం రద్దు చేసుకున్నానని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని తనకు తెలిసి కూడా, కుమారుడు చెప్పడంతో పందెం విరమించుకున్నానని తెలిపారు. ఇక, వచ్చే ఎన్నికల్లో తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కార్యకర్తలు మద్దతు ఇస్తే కచ్చితంగా ఒంగోలు నుంచి బరిలో దిగుతానని, మద్దతు ఇవ్వనంటే అసలు పోటీయే చేయనని అన్నారు. తాను నీతిమంతుడ్ని అని, ఎక్కడా డబ్బులు తీసుకోలేదు అని చెప్పననీ. అయితే ఒంగోలు నియోజకవర్గంలో మాత్రం ఎక్కడా తప్పు చేయలేదని, మంత్రిగా ఉన్నప్పుడు బయటి వాళ్లు ఇస్తే తీసుకున్నాను అనీ అన్నారు. డబ్బులు తీసుకోకుండా తాను రాజకీయాలు చేయలేనని అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

025425
Total views : 147251

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.