నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో కాపుల విషయంలో వైసీపీ చేస్తున్న కుట్రలపై జనసేన నాయకులు మండిపడ్డారు. వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాపు సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వైసీపీ కుట్రపూరిత రాజకీయాలు చేస్తోందని వారు మండిపడ్డారు. కాపుల ఎదుగుదలను అణచివేయడానికి వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని జనసేన నేతలు ఆరోపించారు. కాపు సామాజిక వర్గానికి దక్కాల్సిన ప్రాధాన్యతను, హక్కులను వైసీపీ కాలరాస్తోందని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను కాపుల నుంచి దూరం చేసేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. అంబటి రాంబాబు, నాని, అమర్నాథ్ లకు రాజకీయ భవిష్యత్తు ఉండదని గూడూరు నుంచి జనసేన నాయకులు సవాల్ విసిరారు. కాపులకు జరుగుతున్న అన్యాయాలను జనసేన పార్టీ ఎల్లప్పుడూ అడ్డుకుంటుందని, వారికి అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. వైసీపీ అనుసరిస్తున్న విభజన రాజకీయాలకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
నెల్లూరు జిల్లా గూడూరులో జనసేన నాయకుల సమావేశం.
66
previous post






Total views : 180323