విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో మలేరియా పంజా విసురుతోంది. ఇప్పటికే అనేక గ్రామాల్లో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా జ్వరాలతో మంచం పట్టారు. మరికొందరు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వాసుపత్రి రోగులతో కిటకిటలాడుతుంది. అల్లూరు జిల్లా అనంతగిరి,కోట ప్రాంతాల్లో మలేరియా చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో గిరిజన గ్రామాల్లోని ప్రజలు వణికిపోతున్నారు. పాజిటివ్ కేసులు నమోదవుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.రోజురోజుకి మలేరియా పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయని ఆసుపత్రి వైద్యులే చెబుతున్నారు. చాలా గ్రామాల్లో సరైన వైద్య సదుపాయాలు లేక ఆర్ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. పసర మందుపై ఆధారపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిశిఖర గ్రామాలలో మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
పంజా విసురుతున్న మలేరియా.
208
previous post