Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra PradeshWest Godavari టీడీపీ సీటు హామీపై దుష్ప్రచారం..

టీడీపీ సీటు హామీపై దుష్ప్రచారం..

by Rama
Muddaraboina Venkateswara Rao

తెలుగుదేశం పార్టీలో పార్థసారథి అసలు చేరకుండానే సీటుపై హామీ అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఫోన్లు వస్తున్నాయి అంటూ జరుగుతున్న ప్రచారం వైసీపీ కుట్రే అని నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు గారు అన్నారు. గత మూడు రోజులుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా నూజివీడు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది గ్రామ నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ఆర్సిపి నాయకులకు ఫోన్ చేసి తనకు సీటు కన్ఫర్మ్ అయినట్లు పార్థ సారథి తెలుపుతున్నాడని ఆయన అన్నారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు తన వెంట ఉన్నారని తెలిపిన ముద్ద్రబోయిన వెంకటేశ్వరావు. పార్టీ అధ్యక్షులు కాని అధిష్టానం కాని ఇంతవరకు తనను సంప్రదించలేదని తెలిపారు. పార్థసారథికి సీటు హామీ విషయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా దుష్ప్రచారంపై సంప్రదించామని తమకు ఎటువంటి సమాచారం లేదని ఆయన తెలిపారన్నారు. దీనిని బట్టి చూస్తే వైసీపీ దుష్ప్రచారంలో భాగంగానే సీటు హామీ ప్రచారం జరుగుతోందని దీనిని ఎవరు నమ్మవద్దని ఆయన కోరారు. ఎట్టి పరిస్థితుల్లో తానే పోటీలో టీడీపీ అభ్యర్థిగా ఉంటారన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: