నాగాయలంక (Nagayalanka) మండలంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ లో 200 కుటుంబాల అగ్నికుల క్షత్రియులు చేరారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీతో టిడిపిలో చేరారు. తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు ఆధ్వర్యంలో ఐదు గ్రామాల వైసిపి నాయకులు, కార్యకర్తలు చేరారు. ఎదురుమొండి దీవుల నుండి తన అనుచరులతో, కుటుంబ సభ్యులతో తెలుగుదేశం పార్టీలో చేరిన సైకం అర్జునరావు మనుమడు సైకం దినేష్ ముఖ్య అతిథులుగా టిడిపి జిల్లా అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణ, నాగాయలంకమండల టీడీపీ అధ్యక్షులు మెండు లక్షణ రావు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మండవ బాలవర్ధన్ రావు జిల్లా మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత నాగాయలంక పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ తలశిల వెంకట నరసింహారావు (నాని) 6 మండల పార్టీ ప్రెసిడెంట్ పార్టీ నాయకులు అభిమానులు మహిళలు వేలాదిగా పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్..ముంబై హాస్పిటల్లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
- హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్పోనాలు…
- అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 194596