Monday, April 20, 2026
News Navigation
Monday, April 20, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Andhra Pradesh తుంగభద్ర డ్యామ్ ఘటనపై సమీక్ష చేసిన చంద్రబాబు

తుంగభద్ర డ్యామ్ ఘటనపై సమీక్ష చేసిన చంద్రబాబు

by Rama
తుంగభద్ర డ్యామ్ ఘటనపై సమీక్ష చేసిన చంద్రబాబు

కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాలతో కృష్ణానది వరద ఉప్పొంగుతోంది. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అనూహ్య సంఘటనతో ఒక్కసారిగా పోటెత్తిన వరద ధాటికి తుంగభద్ర డ్యామ్ గేటు ఒక్కసారిగా తెగి వేల క్యూసెక్కుల నీరు దిగువకు పోటెత్తింది. ఫలితంగా దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర ప్రాంతాలలో హై అలెర్ట్ ప్రకటించారు అధికారులు. కర్ణాటక రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో కృష్ణ, తుంగభద్ర, కావేరి వంటి నదులలో వరద పోటెత్తుతోంది. తుంగభద్ర డ్యామ్ ఘటనపై సమీక్ష చేసిన చంద్రబాబు. ఆయా నదులపై కట్టిన ఆనకట్టలు గరిష్ట నీటి స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో జల వనరుల శాఖ అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదే క్రమంలో తుంగభద్ర రిజర్వాయర్ కు చెందిన తెగి గేటు విరిగిపడి కొట్టుకుపోయింది. 35 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు దిగువకు పోటెత్తుతోంది. తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయిన సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారని పేర్కొన్నారు. తుంగభద్ర డ్యామ్ సంఘటన ప్రదేశానికి చంద్రబాబు ఆదేశాలతో సెంట్రల్ డిజైన్ కమిషనర్ తో పాటు ఇంజనీరింగ్ డిజైన్స్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసి పంపించడం జరిగిందని నిమ్మల రామానాయుడు వెల్లడించారు. డ్యాం గేటకొట్టుకుపోయినందున ప్రజలను అప్రమత్తం చేసేలా జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. తుంగభద్రకు వరద పోటెత్తుతున్న నేపథ్యంలో కౌతాలం ,కోసిగి, మంత్రాలయం మరియు నందవరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి రామానాయుడు వెల్లడించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల అధికారులను అప్రమత్తం గా ఉండాలని హెచ్చరించడం జరిగిందని మంత్రి రామానాయుడు పేర్కొన్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

006949
Total views : 46161

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.