మూసీ సుందరీకరణ ప్రణాళికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు అధికారులతో కలిసి సచివాలయం వేదికగా మూసీపై ప్రజెంటేషన్ ఇచ్చారు. మూసీ నదిలో పేదలు ఎదుర్కొంటున్న కష్టాలను అధికారులు గుర్తించారు. మొత్తం 33 బృందాలు మూసీపై అధ్యయనం చేశాయి. పది నెలలుగా అధికారులు నిద్రాహారాలు మానేసి పనిచేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర భవిష్యత్ను నిర్ధేశించే ప్రాజెక్ట్ను ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. విప్లవాత్మక నిర్ణయాలను అడ్డుకునే, వ్యతిరేకించే వాళ్లు అడుగడుగునా ఉంటారు. వారిని పట్టించుకుంటే మనం ముందుకు వెళ్లలేం అని తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివిసించే వారి వివరాలు సేకరించామని, దుర్భర స్థితిలో ఉన్నవారికి మెరుగైన జీవితాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వెళ్తోందని తెలిపారు.
ప్రపంచంతో పోటీ పడేలా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. తాము నిద్రాహారాలు మాని పనిచేసేది అద్దాల కోసం కాదు.. అందాల భామల కోసం కాదు. రాష్ట్ర భవిష్యత్తు కోసమని వెల్లడించారు. నాలుగు యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకొని అధికారంలోకి రావాలనుకోవడం కలే అవుతుందని కేటీఆర్ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. దుబాయ్ వెళ్లి జుట్టుకు నాట్లు వేయించుకునే వాళ్ల కోసం కాదు మూసీ సుందరీకరణ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బందిపోటు దొంగళ్లా పదేళ్లు రాష్ట్రాన్ని పీడించి దోచుకున్నారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేయాల్సిన అవినీతి మొత్తం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాము మూసీకి జీవం పోస్తుంటే చూస్తూ ఓర్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కళ్లమంటతోనే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. దీనిపై చర్చించడానికి తాను సిద్ధమని.. గజ్వేల్ అయినా వస్తా, వేములవాడకైనా వస్తా, కిష్టాపూర్కు అయినా వస్తానన్నారు. సెక్యూరిటీ లేకుండా వస్తా.. సిద్ధమా? అని బీఆర్ఎస్ నేతలకు సవాల్ చేశారు. మూసీ మొత్తం 300 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సర్వమతాలకు ప్రతీక మూసీ నది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధ పరిణామాలు భారత్లో గ్యాస్ కష్టాలను తెచ్చిపెడతాయన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అన్ని…
- భారత దౌత్య నీతి మరోసారి విజయవంతమైంది.పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా వాణిజ్య నౌకలపై భీకర దాడులు జరుగుతున్న వేళ భారత దౌత్య నీతి మరోసారి విజయవంతమైంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం హర్మూజ్ జలసంధి గుండా భారత చమురు నౌకల రాకపోకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
- తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది.తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం సుదీర్ఘంగా విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్…
- విశాఖలో భారీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.విశాఖ ముఖచిత్రాన్ని మార్చే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఐటీ దిగ్గజ కంపెనీ క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్తో భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్..విశాఖలో భారీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు…
- వంటగ్యాస్ కొరతపై లోక్ సభలో రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. అమెరికా అనుమతి లేకుంటే ముటిచమురు కొనరా అని నిలదీశారు.ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారత్లో ఇంధనం కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. భారత్ లో పెట్రోల్, డీజిల్ కొరత లేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ లోక్ సభలో ప్రకటించారు. వంటగ్యాస్ కొరతపై ఆందోళన వద్దని, సంక్షోభాన్ని ఎదుర్కొవడానికి కేంద్రం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి