పేద ప్రజలు సంతోషంగా ఉండడానికి… అద్దె ఇళ్లలో అవస్థలు తీరడానికి టిడిపి ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కడప, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల ప్రాంతాల్లో రెండు విడతల్లో సుమారు 5 వేల ఇళ్లను అత్యాధునిక వసతులతో అపార్ట్మెంట్ స్థాయి నిర్మాణాలు చేపట్టారు. పేదలకు కలగానే మిగిలిపోతున్న టిడ్కో ఇళ్ల నిర్మాణాలు టిడ్కో ఇళ్లను చూసి పేదలు సంబరపడ్డారు. త్వరలోనే సొంతింటిలో చేరుతామని ఆశతో ఎదురు చూశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్లకు బ్రేక్ వేశారు. టిడిపి ప్రభుత్వంలో పూర్తయిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైంది. గత ప్రభుత్వం వీటిని పట్టించుకోకపోవడంతో దెబ్బతిన్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. పూర్తయిన ఇళ్ల మౌలిక వసతుల కోసం 45 కోట్లతో టెండర్లు వేసినా… పనులు ఇంకా మొదలు కాలేదు. కొత్త ప్రభుత్వమైన టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి సొంతింటి కల నెరవేరుస్తుందని లబ్ధిదారులు ఆశతో ఎదురుచూస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 91144