Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra Pradesh విజయవాడ సాయికృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.

విజయవాడ సాయికృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.

by CVR NEWS
సాయికృష్ణ కేసులో కొనసాగుతోన్న సిట్‌ దర్యాప్తు

ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ జెట్ స్పీడ్‌తో దర్యాప్తు చేపడుతోంది. ఈ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణను ముమ్మరం చేసిన సిట్ అధికారులు, ఈ కేసులో మరో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను నిందితులుగా చేర్చారు. నిందితులుగా ఉన్న హెడ్‌కానిస్టేబుళ్లు అశోక్‌, నానిలకు విజయవాడ కోర్టు రిమాండ్‌ విధించింది. జులై 14 వరకు రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అశోక్‌ను మచిలీపట్నం, నానిని ఏలూరు జైళ్లకు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది. సాయికృష్ణ మృతి, మృతదేహం మాయం వ్యవహారానికి సంబంధించి విజయవాడ కృష్ణలంక స్టేషన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుళ్లు అశోక్, నాని సౌత్‌ ఏసీపీ కార్యాలయానికి వచ్చి లొంగిపోయారు. ఏసీపీ మానస వారిని సిట్‌ కార్యాలయానికి తీసుకెళ్లి అప్పగించారు. విచారణలో భాగంగా అడిగిన ప్రశ్నలకు వీరిద్దరూ అన్నింటికీ మౌనం వహించారని.. ఒకటి, రెండు ప్రశ్నలకు మాత్రమే తమకేం తెలియదని పొడిపొడిగా జవాబులు ఇచ్చినట్లు తెలుస్తోంది.లాకప్‌లో అపస్మారక స్థితిలోకి వెళ్లడం, ఆపై మరణించడం వెనుక పోలీసుల నిర్లక్ష్యం, వేధింపులు ఉన్నాయనే కోణంలో సిట్ ఆధారాలను సేకరిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోగా, తాజా పరిణామం పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: