Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra PradeshNeloore అసైన్డ్ భూములకు పట్టాలు పంపిణీ

అసైన్డ్ భూములకు పట్టాలు పంపిణీ

by Satya
Distribution of tracks to assigned lands

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని అంబేద్కర్ భవనంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అసైన్డ్ భూములకు పట్టాలు పంపిణీ చేసారు. బుచ్చి, కోవూరు మండల పరిధిలో నాలుగు గ్రామాలకు చెందిన125 మంది రైతులకు పట్టాలు పంపిణీ చేసారు. దేశానికి వెన్నెముక రైతులు అని, రైతుకు వెన్నెముక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి పట్టాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు శాశ్వత పరిష్కారం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, ఎన్నికలు వస్తున్నాయని పసుపు చొక్కాలేసుకొని పగటి వేషగాల్లందరూ వస్తున్నారు. ఏ పార్టీ ఓటుకు ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకొని ఫ్యాను గుర్తుకు ఓటు వేయండన్నారు. రాబోయే ఎన్నికల్లో గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దోచుకున్న సొమ్ము ఖర్చు పెట్టాలని చూస్తున్నారన్నారు. రాజకీయ నాయకులు కన్నా ప్రజలు తెలివైన వారని వాళ్ళు డబ్బుకు ఆశపడరని, ఎవరి వల్ల లబ్ధి పొందారో వాళ్లకే ఓటు వేస్తారన్నారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014101
Total views : 78980

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.