Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Latest News కాంగ్రెస్ ను నమ్మి మోసపోవద్దు – మంత్రి కేటీఆర్

కాంగ్రెస్ ను నమ్మి మోసపోవద్దు – మంత్రి కేటీఆర్

by Prakash
minister ktr

కొద్దిగా ఆలస్యం అయ్యింది ఎం అనుకోవద్దు. నన్ను మన్నించాలి. ఇక్కడ ఉన్న ఆడబిడ్డలకు ఒక్కటే అడుగుతున్న ఎల్లారెడ్డి పేట కు ఎమ్మెల్యే, మంత్రిగా చేసిన్న లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఎల్లారెడ్డి పేట ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎల్లారెడ్డి పేట ఎలా ఉంది చూడండి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఎరువుల కోసం ఎల్లయ్య అనే రైతు లైన్ లో నిలబడి చనిపోయాడు. ఇక్కడ రోడ్డు పై ఉన్న షాప్ వాళ్ళను అడగండి ఎప్పుడు ఇన్వర్టర్ పెట్టుకొని బిజినెస్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు 24 గంటల కరెంటు ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. వాళ్ల రొచ్చు మాటలు వినే పరిస్థతి లేదు. దేశంలో ఎవరు రైతు బందు ఇవ్వలేదు, మన కెసిఆర్ రైతు బందు ఇచ్చాడు. రేవంత్ రెడ్డి 24 గంటల కరెంటు లేదు అని అని అంటున్నాడు, ఒక్కసారి ఎల్లారెడ్డి పేట మండలంలో ఏ ఊరికి వచ్చిన 24 గంటల కరెంటు చూపిస్తా. ఎల్లారెడ్డి పేట లో స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తాం. మండలంలోని అన్ని గ్రామాల ప్రభుత్వ స్కూల్స్ బాగు చేస్తాం. కాంగ్రెస్ అనేది దున్నపోతు నమ్మి మోసపోవద్దు పాలిచ్చే బీఆర్ఎస్ ను గెలిపించుకుందాం. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే వారానికి రెండుసార్లు సిరిసిల్ల నియోజకవర్గంలో ఉంటాను. మండలంలోని అన్ని గ్రామాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ మాటల నమ్మకండి, బిఆర్ఎస్ ను మరోసారి ఆశీర్వదించి గెలిపించాలి. మీ కడుపులో పుట్టిన బిడ్డగా అనుకొని ఆశీర్వదించి మల్లొకసారి గెలిపించాలి. 30వ తేదీన ఒకటో నెంబర్ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి.

Advertisements

You may also like

Our Visitor

025340
Total views : 147000

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.