అనంతపురం జిల్లా గుత్తి పట్టణం సచివాలయం నెం 8 పరిధిలో వార్డు నెం 15 లో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంతకల్ శాసన సభ్యులు శ్రీ Y.వెంకటరామి రెడ్డి గారు హాజరైయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికారు. వెంకటరామి రెడ్డి గారు వార్డులో పర్యటిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినారు. అంతే కాకుండా రాష్ట్రములో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ వైద్య సేవలు ఉచితంగా అందించిన ఘనత మన జగనన్నకే దక్కుతుందని, మన కోసం ఇంతలా ఆలోచిస్తున్న నాయకుడుకి మనమందరం అండగా నిలబడి జగనన్నను 2024 కూడా మరల ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రజలను కోరారు. అలాగే అర్హత ఉండి ఇంకా ఎవరికైనా సంక్షేమ పథకాలు అందని వారికి కూడా వీలైంత త్వరగా సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గడప గడపకు మన ప్రభుత్వం..
437
previous post






Total views : 196732