Thursday, March 12, 2026
News Navigation

Breaking

Thursday, March 12, 2026
Home Andhra Pradesh రాజధాని అమరావతి రైతులకు శుభవార్త

రాజధాని అమరావతి రైతులకు శుభవార్త

by Satya
రాజధాని అమరావతి రైతులకు శుభవార్త

ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ రాజధాని అమరావతి రైతులకు శుభవార్త చెప్పారు. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు మరో ఐదేళ్ల పాటు కౌలు చెల్లించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి నారాయణ కూడా హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాకు వివరాలు తెలిపారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఏపీ ప్రభుత్వం అమరాతి రైతుల నుంచి రాజధాని కోసం 30 ఏకరాల భూమిని సేకరించింది. పదేళ్ల పాటు రైతులకు వార్షిక కౌలు చెల్లించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడా పదేళ్ల గడువు పూర్తియ్యింది. కాగా శుక్రవారం సీఎం చంద్రబాబు సీఆర్డీఏ సమావేశంలో కౌలు అంశంపై చర్చించారు. అమరావతి రైతులకు వార్షిక కౌలును మరో ఐదేళ్లకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.