Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Andhra PradeshKadapa ద్విచక్ర వాహనదారులతో భారీ అవగాహనా ర్యాలి..

ద్విచక్ర వాహనదారులతో భారీ అవగాహనా ర్యాలి..

by Rama
Huge Bike Rally

అన్నమయ్య జిల్లా.. రాయచోటిని ప్రమాద రహిత రహదారులుగా తిర్చిదిద్దడమే లక్ష్యంగా రవాణా శాఖ, పొలిసు శాఖ పని చేస్తుందని అర్బన్ సి ఐ సుధాకర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ మహబూబ్ బాషా, మోటారు వాహనాల తనిఖి అధికారి అనిల్ కుమార్ లు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖ ఆదేశాలు మేరకు గత నెల జనవరి 20 నుండి 19 వరకు 35 వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. అందులో బాగంగా రాయచోటి మోటారు వాహనాల తనిఖి అధికారి అనిల్ కుమార్ అద్వర్యంలో చెక్ పోస్ట్ శివనంది సర్కిల్ నుండి ద్విచక్ర వాహనదారులతో బారిగా అవగాహనా ర్యాలి నిర్వహించారు. ఈ ర్యాలిలో అర్బన్ సి ఐ సుధాకర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ మహబూబ్ బాషా లు పాల్గొని జెండా ఉపి ర్యాలీని ప్రారంబించారు. ఈ ర్యాలి చెక్ పోస్ట్ శివనంది సర్కిల్ నుండి యస్ యన్ కాలనీ మీదగా నేతాజీ కూడలి వరకు కొనసాగించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా నే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఈ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ భద్రతా మాసోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా గడిచిన ఏడాది సుమారు 699 రోడ్డు ప్రమాదాలు జరిగాయని అందులో 365 మంది ప్రాణాలు కోల్పోయ్యారని, 912 గాయాలు పాలైనట్లు వారు వెల్లడించారు. రోడ్డు పై వాహానాలు నడిపి ప్రతి డ్రైవర్ కుడా లైసెన్స్ లతో ఇతర డాక్యుమెంట్ లు తప్పని సరిగా పెట్టుకోవలన్నారు. ప్రతి కుటుంబం రోడ్డు భద్రతా నియమాల పై అవగాహన కలిగి వుండాలని వారు కోరారు. పాదచారులు కుడా రోడ్డు దాటుతున్న సమయంలో వాహనాల రాకపోకలను తప్పని సరిగా గుర్తించి రోడ్డు దాటాలన్నారు. మదనపల్లె రోడ్డు లో ఎక్కువగా ప్రమాదాలు జరిగేవని పొలిసులు ఆ రహదారిలో స్పీడ్ బ్రేకర్ లు ఏర్పాటు చేయడం తో రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించ గలిగామన్నారు. ఈ ర్యాలిలో డ్రైవింగ్ స్కూల్, షో రూమ్ ల యాజమాన్యం, తో పాటు ద్విచక్ర వాహనదారులు, యం వి ఐ సిబ్బంది, పొలిసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: