పేద ప్రజలకు ఆశలు చిగురించేలా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల మొదటి విడత ఎంపిక ప్రక్రియను డిసెంబర్ మొదటి వారంలో జాబితా సిద్ధం చేసేందుకు అడుగులు వేస్తోంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నిబంధనలపై స్పష్టత రాకపోవడం, కేంద్రం నుండి అంగీకారం రాకపోవడం తో .. కేంద్రం నిర్ణయానికి ,రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలకు సరిపోలకపోవడంతో ఇంకా అంగీకారం రాలేదు .
రాష్ట్రం లో గ్రామసభల ఏర్పాటు ప్రక్రియలు ముందుకు కదలలేదు. ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రానికి కేంద్రం వాటా అందాలంటే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రాష్ట్రంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే కూడా ఈ నెలాఖరులో పూర్తయ్యే అవకాశం ఉంది. తర్వాతే లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
స్థలం ఉన్నవారికే మొదటి దశలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని సర్కార్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణానికి తగ్గకుండా లబ్దిదారుడు ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుంది. దీనికి సర్కార్ నాలుగు దశల్లో రూ. 5లక్షల చెల్లిస్తుంది అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది .
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనుల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. వెంకటాపూర్ మండలం కేశాపూర్ గ్రామ శివారులో కూలీలతో కలిసి స్వయంగా పని చేసి ఆకట్టుకున్నారు.వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కూలీలు జాగ్రత్తలు పాటించాలని సూచించిన మంత్రి.. వారికి…
- ప్రణీత్ ప్రణవ్ గ్రూప్పార్క్పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..హైదరాబాద్ శివారు గాగిల్లాపూర్లో ఉన్న ప్రణీత్ గ్రూవ్ పార్క్ అక్రమాలపై స్థానికులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థ చెరబట్టిన ఉస్మాన్ కుంట గతంలో తమకు ప్రధాన నీటి వనరుగా ఉండేదని.. పక్కనే ఉన్న గడ్డపోతారం ప్రజలు చెబుతున్నారు. తమ చిన్నతనంలో…
- యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట టెంపుల్లో స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా 108 కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాటిలోని పవిత్ర జలాలకు పూజలు చేశారు.పంచామృతం,…
- కడప జిల్లా పులివెందులలో నీటి సమస్యలపై బి.టెక్ రవి విమర్శలు..కడప జిల్లా పులివెందులలో రాజకీయ హీట్ పెరుగుతోంది.ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ తాగునీటి సమస్యలు కొనసాగుతున్నాయని టీడీపీ ఇంచార్జి బి.టెక్ రవి విమర్శించారు.ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పులివెందుల పట్టణంలోని క్రిస్టియన్ వీధిలో పెన్షన్లు ఆయన…
- అమెరికాలో తెలుగు యువకుడు ఆత్మహత్య..ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో అమెరికాకు వెళ్తున్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత. ఐతే అక్కడ ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్లు కొందరైతే..మరికొంత మంది సరైన ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు..ఈ నేపథ్యంలోనే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 61824