51
జపాన్ ప్రధానమంత్రి సనాయె తకాయిచీ మూడు రోజుల పర్యటనకు భారత్ రానున్నారు. జులై ఫస్ట్ నుంచి మూడో తేదీ వరకు ఢిల్లీలో వేదికగా భారత్ జపాన్ 16 వ వార్షిక సదస్సు జరగనుంది. గత ఏడాది జరిగిన సదస్సు సందర్భంగా భారత్కు రావాలంటూ ప్రధానమంత్రి మోదీ ఆహ్వానించగా… దానికి అనుగుణంగా తకాయిచీ భారత్కు రానున్నారు. ద్వైపాక్షిక బంధాల బలోపేతంతో పాటు… జాతీయ, అంతర్జాతీయ అంశాలపై రెండు దేశాల పాలకులు అభిప్రాయాలను పంచుకునేందుకు ఈ సదస్సు వేదికగా నిలవనుంది. జపాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక సనాయె తకాయిచీ భారత్కు రావడం ఇదే తొలిసారి. గత ఏడాది టోక్యోలో జరిగిన సదస్సు తర్వాత ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు బలోపేతమయ్యాయని విదేశాంగశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.





Total views : 180225