ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్(Jagan) గుంటూరు జిల్లా(Guntur District)లో ఎన్నికల ప్రచారం(Election campaign) నిర్వహించారు. చంద్రబాబు(Chandrababu) తనను ఒక బచ్చా అంటున్నాడని, పోయేకాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హీరోలు బచ్చాలుగానే కనిపిస్తారని అన్నారు. నేను బచ్చా అయితే… నన్ను చూసి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నాడు? నేను బచ్చా అయితే… నన్ను ఎదుర్కొనేందుకు ఎందుకు పొత్తులు పెట్టుకున్నాడు? అని సీఎం జగన్ ప్రశ్నించారు. ఎన్నికలకు ఒంటరిగా వచ్చి ధైర్యంగా పోరాడుతున్నాను అని జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు అంత పుడింగి అయితే పొత్తులు లేకుండా సింగిల్ గా రావొచ్చు కదా అని సవాల్ విసిరారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏం చేశాడో కూడా చెప్పుకోలేకపోతున్నాడని, చంద్రబాబు అంటే గుర్తుకువచ్చే పథకం ఒక్కటైనా ఉందా అని సీఎం జగన్ విమర్శించారు. మా ప్రభుత్వంలో అమ్మ ఒడి, పెన్షన్లు, ఆసరా, చేయూత, వాహనమిత్ర వంటి పథకాలు తెచ్చామని …. అలాంటివి చంద్రబాబు ఎందుకు అమలు చేయలేదని జగన్ విమర్శించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏలను సెప్టెంబరు నెల జీతంతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. 2025 జనవరి 1 నుంచి 1.82 శాతం…
- ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.