తెలంగాణలో నేటి నుండి అసెంబ్లీ , శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రధాన సమస్యలపై ఎజెండాను అధికార పక్షం సిద్దం చేసుకుంది. విపక్షాలు కూడా తమ అస్త్ర శస్త్రాలతో రెడీ అయ్యారు. ఈ సమావేశాలకు కేసీఆర్..ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన మార్పుపై పట్టుబట్టేందుకు బీఆర్ఎస్ వర్గాలు సిద్దమైనట్లు తెలుస్తోంది. తెలంగాణలో అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమంటూ ఆ పార్టీ అగ్రనేతలు తెలంగాణ ఎమ్మెల్యేలకు సూచించారు. అధికార పార్టీ హామీలైన ఆరుగ్యారెంటీల అమలును విమర్శనాస్త్రంగా సంధించనున్నది. తెలంగాణలో అధికారంలోకి రావడానికి అవసరమైన వ్యూహంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. విపక్షాలను తిప్పికొట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ అంతా రెడీ అయ్యింది. ముందస్తు సమావేశం నిర్వహించి వ్యూహరచన చేసుకుంది. ప్రతిపక్షాలు గుక్కతిప్పుకోకుండా సమాధానాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది. అధికారులు, పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేసింది. సభ సజావుగా సాగడానికి అవసరమైన యంత్రాంగాన్ని అంతా సమాయత్తం చేసింది. అసెంబ్లీ పరిసరాల్లో భారీ బందోబస్తుకు ఏర్పాట్లు చేసింది. ఎక్కడికక్కడే విపక్షాల వ్యూహాలను చిత్తు చేసే దిశగా పార్టీ యాంత్రాంగాన్ని సైతం సిద్ధం చేసుకుంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
- నీట్ పేపర్ లీక్పై సుప్రీంకోర్టులో విచారణ.నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
- సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో విచిత్ర ఘటన.సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నేరస్తులు, ఖైదీలకు వేయాల్సిన సంకెళ్లను ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకే వేసిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఠాణా ప్రాంగణంలోకి ఇతర వాహనాలు, అనధికార…
- సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష విరమణ.దేశ విద్యావ్యవస్థలో పారదర్శకత, సమగ్ర సంస్కరణల కోసం గత 26 రోజులుగా లడఖ్ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చల అనంతరం ఆయన తన సుదీర్ఘ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి