తెలంగాణలో నేటి నుండి అసెంబ్లీ , శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రధాన సమస్యలపై ఎజెండాను అధికార పక్షం సిద్దం చేసుకుంది. విపక్షాలు కూడా తమ అస్త్ర శస్త్రాలతో రెడీ అయ్యారు. ఈ సమావేశాలకు కేసీఆర్..ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన మార్పుపై పట్టుబట్టేందుకు బీఆర్ఎస్ వర్గాలు సిద్దమైనట్లు తెలుస్తోంది. తెలంగాణలో అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమంటూ ఆ పార్టీ అగ్రనేతలు తెలంగాణ ఎమ్మెల్యేలకు సూచించారు. అధికార పార్టీ హామీలైన ఆరుగ్యారెంటీల అమలును విమర్శనాస్త్రంగా సంధించనున్నది. తెలంగాణలో అధికారంలోకి రావడానికి అవసరమైన వ్యూహంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. విపక్షాలను తిప్పికొట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ అంతా రెడీ అయ్యింది. ముందస్తు సమావేశం నిర్వహించి వ్యూహరచన చేసుకుంది. ప్రతిపక్షాలు గుక్కతిప్పుకోకుండా సమాధానాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది. అధికారులు, పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేసింది. సభ సజావుగా సాగడానికి అవసరమైన యంత్రాంగాన్ని అంతా సమాయత్తం చేసింది. అసెంబ్లీ పరిసరాల్లో భారీ బందోబస్తుకు ఏర్పాట్లు చేసింది. ఎక్కడికక్కడే విపక్షాల వ్యూహాలను చిత్తు చేసే దిశగా పార్టీ యాంత్రాంగాన్ని సైతం సిద్ధం చేసుకుంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జమ్ము మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం..జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా పై హత్యాయత్నం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం సురీందర్ తో కలిసి ఓ పెళ్లి వేడుకకు వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా. ఈ సందర్భంగా ఫరూఖ్ అబ్దుల్లాకు భారీ భద్రత ఉంది.…
- ఆర్ అండ్ బీ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష .రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని దీర్ఘకాలిక దృష్టితో ముందుకు తీసుకెళ్లాలని, 2047 విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల అభివృద్ధి…
- ఫుడ్స్ పెట్టలేమంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాలు సర్క్యులర్ జారీ చేశాయి.పశ్చిమాసియా యుద్ధ సెగ ఐటీ ఉద్యోగులకు తగిలింది. ఫుడ్స్ పెట్టలేమంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాలు సర్క్యులర్ జారీ చేశాయి. ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా హైదరాబాద్ హాస్టల్ యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయని తెలిపాయి. కేవలం ముఖ్యమైన ఆహార…
- పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రభుత్వం ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ పార్లమెంటులో వెల్లడించిన సమాచారం ప్రకారం,…
- సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది.సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం వారికి పలు అంశాలపై లక్ష్యాలను నిర్దేశించారు. సంక్షేమ, అభివృద్ధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. అధికారులు-ప్రజాప్రతినిధుల…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి