మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇండియా కూటమికి భారీ విజయం అందించినందుకు జార్ఖండ్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం కోసం కృషిచేసిన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్, JMM కార్యకర్తలందరికీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్రంలో మహాకూటమి సాధించిన ఈ విజయం రాజ్యాంగంతో పాటు నీరు, అటవీ, భూముల పరిరక్షణకు దక్కిన విజయం అని తెలిపారు. అలాగే మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు ఊహించలేదని, తాము వాటిని వివరంగా విశ్లేషిస్తామన్నారు. ఇండియా కూటమి విజయం కోసం.. కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాగా మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్డీయే కూటమి 231 స్థానాల్లో విజయం సాధించగా, ఇండియా కూటమి 45 స్థానాల్లో మాత్రమే గెలిచింది. జార్ఖాండ్ లో మాత్రం 81 అసెంబ్లీ స్థానాలకు గాను 56 స్థానాల్లో విజయం సాధించి జె ఎమ్ఎమ్ పార్టీతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ప్రధాని మోదీకి సీఎం రేవంత్రెడ్డి బహిరంగ లేఖ..ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు సీఎం రేవంత్రెడ్డి. డీలిమిటేషన్తో సౌత్ స్టేట్స్తో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఈ నిర్ణయంతో బీజేపీకి తాత్కాలికంగా లాభం జరగవచ్చు కానీ..దీర్ఘకాలంలో దేశానికి నష్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి..ఈ మేరకు డీలిమిటేషన్ విషయంలో…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు రావడంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. ప్రస్తుతం దర్శనానికి సుమారు…
- భారత భూభాగాలకు చైనా కల్పిత పేర్లు..అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాలకు చైనా కల్పిత పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. చైనా చర్య దురుద్దేశపూరితమంటూ మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో విడదీయలేని అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. కల్పిత పేర్లు పెట్టడం ద్వారా వాస్తవాలను మార్చలేరని స్పష్టం చేసిన…
- హైదరాబాద్లో అంతులేకుండా పోతున్న రియల్ మోసాలు..హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సంస్థల ఆగడాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. చిన్న చితకా సంస్థల నుంచి మొదలుపెట్టి… బడా బడా కన్స్ట్రక్షన్ కంపెనీల వరకూ అందరూ నిబంధనలను తుంగలో తొక్కేవారే. కొంచెం ఎక్కువ… కొంచం తక్కువ అనే తప్ప… ఉల్లంఘనలకు…
- పశ్చిమాసియాలో మళ్లీ మొదటికొచ్చిన పరిస్థితి..పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పాకిస్థాన్ వేదికగా అమెరికా – ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో… మళ్లీ యుద్ధం మొదలయ్యే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ దిశగా ట్రంప్ అనేక సూచనలు కూడా ఇచ్చారు. దీంతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 38466