Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Telangana ఫ్రీ బస్సు ద్వారా మ‌హిళ‌లకు 3747 కోట్ల ఆదా

ఫ్రీ బస్సు ద్వారా మ‌హిళ‌లకు 3747 కోట్ల ఆదా

by Rama
ఫ్రీ బస్సు ద్వారా మ‌హిళ‌లకు 3747 కోట్ల ఆదా

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ద్వారా మహిళలు ఎంతగానో లబ్ధి పొందారని, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్‌లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ పనితీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మ‌హాల‌క్ష్మి-మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్రయాణ సౌక‌ర్యం, కొత్త బ‌స్సుల కొనుగోలు, లాజిస్టిక్స్, ఆర్థిక ప‌ర‌మైన అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ అంశాలను ప‌వ‌ర్ పాయింట్ ప్రజంటేష‌న్ ద్వారా మంత్రికి ఆర్టీసీ ఉన్నతాధికారులు వివ‌రించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని ఆర్టీసీ సమర్థవంతంగా అమలు చేస్తుందని, సంస్థలో ప్రతి ఒక్క సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఈ నెల 20 వ‌ర‌కు రూ.111 కోట్ల జీరో టిక్కెట్లను సంస్థ జారీ చేసింద‌ని, ఫ‌లితంగా ఫ్రీ బస్సు ద్వారా మ‌హిళ‌లకు 3747 కోట్ల ఆదాచేసుకున్నార‌ని మంత్రి వెల్లడించారు. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కానికి సంబంధించిన టికెట్ల రీయింబ‌ర్స్‌మెంట్‌ను ఆర్టీసీకి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని వివరించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.
    రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ముఖ్యంగా బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాజధానిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం…
  • పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.
    2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని వాడపల్లి…
  • ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.
    ఏపీ హైకోర్టు మాజీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడైన ఐపీఎస్ అధికారి ఎం. సునీల్ కుమార్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను జూలై 3, 2026కి వాయిదా వేసింది. అప్పటివరకు ఆయనకు మధ్యంతర రక్షణ కల్పించిన…
  • లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి.
    రైడ్స్ జరగడం… అధికారులు పట్టుబడడం… ఆ తర్వాత కేసులన్నీ నీరుగారిపోవడం… ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ పరిధిలో జరుగుతున్న పరిణామాలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తి ఇది. వ్యవస్థను పట్టిపీడిస్తున్న అవినీతి వైరస్‌కు వ్యాక్సిన్ వేయాల్సిన ఏసీబీ వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.…
  • ఫిన్‌లాండ్‌లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.
    తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి విదేశాల్లో అదృశ్యమై 45 రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఫిన్‌లాండ్‌లో బీటెక్ చదువుతున్న మణిదీప్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడిని క్షేమంగా తిరిగి…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

027120
Total views : 151594

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.