అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ సందర్భంగా చెన్నూరులో ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటుపై ప్రశ్నించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరులో బస్సు డిపో ఏర్పాటు చేయాలని కోరారు. చెన్నూరుకు 3 రాష్ట్రాల బస్సులు వస్తాయని.. అందువలన త్వరగా బస్ డిపో పూర్తి చేయాలన్నారు. చెన్నూరు టూ హైదరాబాద్ ఆర్టీసీ బస్సు సర్వీసులు పెంచాలని మంత్రిని కోరారు. మంచిర్యాల టూ చెన్నూరు వయా బీమారం బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలి. అలాగే ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు మందమర్రి డిపోకు వచ్చి వెళ్లాలని మంత్రికి రిక్వెస్ట్ చేశారు ఎమ్మెల్యే వివేక్ .
15 ఏళ్లు దాటిన బస్సులన్నింటినీ తొలగిస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అలాగే కొత్త రూట్లకు కూడా బస్సులు త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. చెన్నూరులో బస్ డిపో ఏర్పాటుకు ప్రభుత్వం టెండర్లు పిలిచిందన్నారు మంత్రి పొన్నం . చెన్నూరు బస్ డిపో కోసం 4 కోట్లు మంజూరు చేశామన్నారు. మొదటి విడతగా కోటి 20 లక్షలు చెల్లించిందన్నారు. కాంపౌండ్ వాల్ , బేస్మెంట్ , గారెజ్ పనులు పూర్తయ్యాయి.. కానీ ఆర్టీసీకి సంబంధించిన భూమి హై కోర్టు స్టే ఉన్నందున పనులు నిలిచిపోయాయని తెలిపారు. హైకోర్టు స్టే ఎత్తివేసిన తర్వాత డిపో ఏర్పాటును వేగవంతం చేస్తామన్నారు మంత్ర పొన్నం.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.హైదరాబాద్లో మరోసారి అక్రమ వలసదారుల గుట్టు రట్టయింది. హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన జీడిమెట్లలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్పోర్టులు, వీసాలు లేకుండా దేశంలోకి చొరబడిన వీరు… కొంతకాలంగా ఇక్కడే ఉంటూ…
- స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న 15 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి… మరికొందరిని బదిలీ చేసింది. నాసిరకం మెటీరియల్ కొనుగోలు, పర్యావేక్షణ లోపం, ముందస్తు భద్రతా చర్యలు…
- మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్కు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. సోలార్ ప్లాంట్ ద్వారా నెలకు లక్ష…
- కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో చిన్నారితో వెళ్లిన పెంపుడు కుక్క తోట నుంచి తిరిగొచ్చిన తర్వాత మృతి చెందడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారి జాహ్నవి వెంట వెళ్లి తిరిగి వచ్చిన కుక్క.. రెండ్రోజులుగా…
- ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్లో వి. వి. వినాయక్.వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ,…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 141674