విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న 15 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి… మరికొందరిని బదిలీ చేసింది. నాసిరకం మెటీరియల్ కొనుగోలు, పర్యావేక్షణ లోపం, ముందస్తు భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో 15 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు స్టీల్ ప్లాంట్లో ఇలాంటి నిర్ణయం ఏ రోజు జరగలేదు. వరుస ప్రమాదాల నేపథ్యంలో యాజమాన్యం తీసుకున్న ఈ కఠిన నిర్ణయాలు స్టీల్ ప్లాంట్లో ఒక్కసారిగా వాతావరణాన్ని మార్చేశాయి. ప్రమాదం విషయంలో యాజమాన్యం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్లాంట్ విషయంలో భద్రత చర్యలు మెయింటినెన్స్ చేపట్టాలని సూచిస్తున్న పట్టించుకోలేదని… ప్రమాదం జరిగిన తర్వాత ఇలా వ్యవహరించడం తగదంటున్నారు.
స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.
94
previous post




Total views : 202955