Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Main News పెట్రోల్ బంకుల వద్ద పడిగాపులు కాస్తున్న వాహనదారులు..

పెట్రోల్ బంకుల వద్ద పడిగాపులు కాస్తున్న వాహనదారులు..

by Rama
Petrol Bunk

మెదక్ జిల్లా నర్సాపూర్, శివంపేట, హత్నూర మండలం లో పెట్రోల్ పంపులు వద్ద బారులు తీరిన వాహనదారులు, పెట్రోల్, డిజిల్ దొరకక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ బస్సులు, ఆటోలు, లారీలు, బైకులు పెట్రోల్ బంకులలో డిజిల్ లేకపోవడంతో ఉదయం నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల వ్యవసాయం చేసుకోవడానికి ట్రాక్టర్లలో డిజిలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, నాట్లు వేయడానికి కూలీలను పిలుచుకున్నాం, డీజిల్ కోసం వచ్చేసరికి పంపులలో డిజిల్ లేదని చెప్పడంతో డీజిల్ ఎప్పుడు వస్తుందని చూస్తూ పడిగాపులు కాస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు రైతులు హిట్ హాండ్ రన్ వాహన చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వాహనదారులు చేపట్టిన సమ్మెకు గాను, డీజిల్ రాకకు అంతరాయం ఏర్పడడంతో పలుచోట్ల డీజిల్ బంకులు బందు చేశారు, కొన్ని పెట్రోల్ బంకులు డీజిల్ పోయకపోవడంతో వాహనదారులు ఆందోళనకు దిగారు. నర్సాపూర్లో ప్రధాన రహదారి గుండా వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. డీజిల్ పోయకపోవడంతో బంకుల వద్ద రహదారి పైకి వచ్చి వాహనదారులు ధర్నా చేపట్టడంతో ఇతర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: