కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా ఆదేశాలతో అక్రమ మద్యం విక్రయాలు అరికడుతున్నట్లు చల్లపల్లి సీఐ సీహెచ్ నాగప్రసాద్ తెలిపారు. చల్లపల్లి పోలీస్ స్టేషనులో సీఐ మాట్లాడుతూ ఎస్ఐ సీహెచ్ చినబాబుకు అందిన పక్కా సమాచారం ఆధారంగా తమ చల్లపల్లి మండలం మాజేరులోమంగళవారం రాత్రి తనిఖీలు చేసినట్లు తెలిపారు. మచిలీపట్టణం మండలం అరిసేపల్లి శివారు హుసేన్ పాలెం గ్రామానికి చెందిన యార్లగడ్డ సురేష్ అనే వ్యక్తి చల్లపల్లి మండలం మాజేరు గ్రామానికి చెందిన జన్యావుల వెంకట సుబ్బారావుకు 118 అక్రమ మద్యం సీసాలను మారుతీ సుజుకి కారులో తెచ్చి సరఫరా చేస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. వీరిద్దరూ ఒక్కో సీసాపై రూ.50 అదనపు ధరకు విక్రయిస్తూ చెరో సగం లాభం పంచుకుంటున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వారి వద్ధ నుంచి 118 సీసాలు అక్రమ మద్యం స్వాధీనం చేసుకుని, ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మద్యం సరఫరాకు వినియోగిస్తున్న కారు సీజ్ చేసినట్లు తెలిపారు.
118 మద్యం సీసాల పట్టివేత…
409
previous post




Total views : 79066